రాష్ట్ర సహకారం లేకే రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తమ వాటా నిధులు విడుదల చేయకపోవడం.... భూ కేటాయింపులు పూర్తి చేయకపోవడంవల్లే తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ వాటా.. భూమి కేటాయింపులు పూర్తి చేయండి
సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ
ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తమ వాటా నిధులు విడుదల చేయకపోవడం.... భూ కేటాయింపులు పూర్తి చేయకపోవడంవల్లే తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయడం లేదని ఇటీవల తెరాస నేతలు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరోపణలకు ముందు ఇప్పటికే కేటాయించిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వ్యయాన్ని, చేయాల్సిన భూ కేటాయింపులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. ‘‘ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు నిధుల కేటాయింపు కొన్ని రెట్లు పెరిగింది. 2014-15 బడ్జెట్లో రూ.250 కోట్లుగా ఉన్న కేటాయింపులు 2021-22 నాటికి రూ.2,420 కోట్లకు పెరిగాయి. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చొరవ చూపి తక్షణమే సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తారని విశ్వసిస్తున్నాను’’ అని పేర్కొంటూ కిషన్రెడ్డి ఆయా ప్రాజెక్టుల్లోని సమస్యలను లేఖలో వివరించారు.
* మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైలు మార్గం (151 కి.మీ.) నిర్మాణ వ్యయంలో ఇప్పటికీ రూ.100 కోట్ల బకాయి ఉంది. 342 హెక్టార్ల భూమిని రైల్వేకు అప్పగించాలి.
* అక్కన్నపేట-మెదక్ నూతన రైలు మార్గానికి 2021-22 ఏడాదికిగాను రాష్ట్రం రూ.31 కోట్లను చెల్లించడంతో పాటు 1.02 హెక్టార్ల భూమిని అప్పగించాలి.
* ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్ట్కు కేంద్ర ఇప్పటివరకు రూ.835 కోట్లు వ్యయం చేయగా రాష్ట్ర ప్రభుత్వం రూ.129 కోట్లు మాత్రమే జమ చేసింది. అంచనావ్యయం పెరిగిన మేరకు తన వాటాగా రూ.760 కోట్లు జమ చేయాల్సి ఉంది.
* రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2ను యాదాద్రి వరకు (33 కి.మీ.) పొడిగించేందుకు రైల్వే బోర్డు అనుమతించింది. రాష్ట్రం నిధులు జమ చేయనందున ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభంకాలేదు.
* భద్రాచలం రోడ్-సత్తుపల్లి నూతన మార్గం (53.2 కి.మీ.) పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2021, జులై నాటికే దీనిని ప్రారంభించాలనుకున్నా ఎలక్టిక్ర్ హైటెన్షన్ క్రాసింగ్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించిన భూ సమస్యలతో జాప్యం చోటుచేసుకుంది.
* కేంద్రమే పూర్తి నిధులిచ్చిన ప్రాజెక్టుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణలో చొరవ చూపకపోవడంతో ఆలస్యమవుతున్నాయి. ఉదా।। కాజీపేట-బలార్షా మూడో మార్గం, కాజీపేట-విజయవాడ మూడో మార్గం.
* కాజీపేట-హసన్పర్తి రోడ్ స్టేషన్ల మధ్య బైపాస్ లైన్, మూడో మార్గం పనులకు (11.06 కి.మీ.) 7.8 హెక్టార్ల భూమి అప్పగించాలని కోరి అందుకయ్యే వ్యయాన్ని జమ చేసినా రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించలేదు.
* మణుగూరు-రామగుండం, కొండపల్లి-కొత్తగూడెం మార్గాల నిర్మాణాల్లో వ్యయ భాగస్వామ్యానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఆ ప్రాజెక్టుల్లో వాటా నిర్ధారణకు తెలంగాణ ప్రభుత్వానికి అనేక అభ్యర్థనలు పంపినా ఏ స్పందనా లేదు. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణా-వికారాబాద్, కరీంనగర్-హసన్పర్తి, బోధన్-లాతూర్ రోడ్డు నూతన మార్గాల నిర్మాణానికి ఇప్పటికే సర్వే పూర్తయినా వ్యయ భాగస్వామ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించకపోవడంతో మంజూరు ఆగిపోయింది.
* చర్లపల్లి రైల్వేస్టేషన్ను కొత్త శాటిలైట్ టెర్మినల్ స్టేషన్గా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. అయితే స్టేషన్ చేరుకోవడానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించడానికి వీలవుతుంది.
* రాష్ట్రానికి మొత్తం 54 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరయ్యాయి. అనేక అంశాలపై రాష్ట్ర అధికారుల నుంచి సహకారం అందడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!