Guntur: మృతుని పేరు మీద 12 ఏళ్లుగా పింఛను
21 ఏళ్ల క్రితం మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా కుమారుడు వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న వైనం సోమవారం వెలుగు చూసింది.
కుమారుడిపై బంధువుల ఫిర్యాదు
నరసరావుపేట అర్బన్, న్యూస్టుడే: 21 ఏళ్ల క్రితం మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా కుమారుడు వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న వైనం సోమవారం వెలుగు చూసింది. మృతుని బంధువులు పారా బాబూరావు, పారా జ్యోతి, పారా క్రాంతి తెలిపిన ప్రకారం.. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన పారా కిరీటి 2001లో మృతి చెందారు. జీవించి ఉండగా ఆయన ఎప్పుడూ పింఛను తీసుకున్న దాఖలా లేదు. అయితే ఆయన చిన్న కుమారుడు తన మామను తండ్రిగా చూపించి పింఛనుకు దరఖాస్తు చేస్తే 2011లో అధికారులు మంజూరు చేసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయనకు వృద్ధాప్య పింఛన్ చెల్లిస్తున్నారు. ఇదే అంశంపై గత నెలలో మృతుని బంధువులు అధికారులను కలిసి కిరీటి మరణ ధ్రువపత్రం సమర్పించి, ఫిర్యాదు చేశారు. అయినా ఈ నెలలోనూ అధికారులు రూ.2750 పింఛను ఇచ్చేశారు. దీనిపై మృతుడి బంధువులు తాజాగా జేసీకి ఫిర్యాదు చేశారు. మరణించిన వ్యక్తి పేరుతో 144 నెలలుగా అక్రమంగా పింఛను తీసుకుంటూ ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారని, ఇప్పటి వరకు రూ.4 లక్షల మేర పింఛను పొందారన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని డీడీవో మహాలక్ష్మిని జేసీ శ్యాంప్రసాద్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
CM Revanth: సీఎం రేవంత్రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభ కోసం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబయి బయల్దేరిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. -
శ్రీవారి భక్తులకు అపరిమితంగా శ్రీవాణి టికెట్ల జారీ!
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను తితిదే రద్దు చేసిన విషయం తెలిసిందే. -
రామగుండంలో సింగరేణి విద్యుత్కేంద్రం!
విద్యుదుత్పత్తి పెంపుపై సింగరేణి ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏటా డిమాండ్ పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. -
నేటి నుంచి ఓ మోస్తరు వర్షాలు!
రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. -
కవితను కలిసిన కుటుంబసభ్యులు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను ఆదివారం సాయంత్రం కుటుంబసభ్యులు కలిశారు. -
మంచి చేసే వారికి సమాజంలో గుర్తింపు
సమాజాభివృద్ధికి కృషిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం ఆదివారం ముగిసింది. -
చీరకట్టులో నారీ పరుగు..
హైదరాబాద్ నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ప్లాజా ఆదివారం ఉదయం చీరకట్టులో ఉన్న మహిళలతో సందడిగా కనిపించింది. -
వ్యాట్ సొమ్ము ఎగవేత?
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నా ఆస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి విలువ ఆధారిత పన్ను(వ్యాట్) మాత్రం రావడం లేదు. -
కాంతివేగంతో ఎలక్ట్రాన్ల శక్తి మార్పిడి
హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్) శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్లను లేజర్ ఆధారిత సూక్ష్మ పద్ధతిలో మెగా ఎలక్ట్రాన్ ఓల్ట్గా మార్చే విధానాన్ని కనుగొన్నారు. -
మైనార్టీ గురుకుల సొసైటీ పునర్నియామకం
రాష్ట్ర మైనార్టీ గురుకుల విద్యాలయ సంస్థ పరిపాలన మండలిని ప్రభుత్వం పునర్నియమించింది. -
ఆర్టీసీ కార్గో ఆదాయ లక్ష్యం రూ.300 కోట్లు!
టికెటేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై టీఎస్ఆర్టీసీ దృష్టి సారించింది. సంస్థకు పెద్దసంఖ్యలో బస్డిపోలు, బస్టాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నెట్వర్క్ ఉంది. -
పాలేరు.. అడుగంటుతున్న నీరు!
నాలుగు జిల్లాల ప్రజలకు కీలక తాగునీటి వనరైన పాలేరు జలాశయం వేసవి ప్రారంభంలోనే అడుగంటుతోంది. -
యాసంగి సాగు.. 5 జిల్లాల్లో లోటు
రాష్ట్రంలో యాసంగి సీజన్లో 5 జిల్లాలు పంటల సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని చేరలేకపోయాయి. అలాగే పలు పంటలకు సంబంధించి సాగు విస్తీర్ణం కూడా తగ్గినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. -
పంట రుణాలపై మళ్లీ బ్యాంకుల నిర్లక్ష్యం
రాష్ట్రంలో పంట రుణాల మంజూరులో బ్యాంకుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. వార్షిక ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు అన్నదాతలకు సాయం అందించడానికి బ్యాంకులు మొరాయిస్తున్నాయి. -
సైబర్ బాధితులకు ఇక సత్వర న్యాయం
సైబర్ నేరాల బారిన పడిన వారికి ఇక సత్వర న్యాయం జరగనుంది. జప్తు చేసిన డబ్బును లోక్ అదాలత్ల ద్వారా సాధ్యమైనంత త్వరగా బాధితులకు అందించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. -
రైల్వే కార్మిక సంఘాల సమ్మె వాయిదా
దేశ వ్యాప్తంగా మే 1న తలపెట్టిన రైల్వే కార్మిక సంఘాల సమ్మెను లోక్సభ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఎన్ఎఫ్ఐఆర్, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ప్రకటించారు. -
ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. -
రామప్ప ఆలయ శిల్పకళ అద్భుతం
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే దంపతులు సందర్శించారు. -
ట్రైబ్యునల్ తీర్పు వచ్చేంతవరకు.. ‘పాలమూరు’ డీపీఆర్ మదింపు సాధ్యం కాదు
తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలసంఘానికి పంపిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ మదింపు కృష్ణా ట్రైబ్యునల్ తుది తీర్పు వెలువడేంత వరకూ సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. -
‘భాషాపండితుల సమస్యలను పరిష్కరించాలి’
తెలంగాణలో భాషాపండితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర ప్రభుత్వ త్రిసభ్య కమిటీని కోరింది. -
యాదాద్రిలో వైభవంగా ఎదుర్కోలు వేడుక
ప్రసిద్ధ క్షేత్రమైన యాదాద్రిలో బ్రహ్మోత్సవ విశేష పర్వాలకు ఆదివారం రాత్రి నిర్వహించిన ఎదుర్కోలు వేడుకతో శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Hyderabad News: చల్లబడిన వాతావరణం.. హైదరాబాద్లో వర్షం!
-
Tamilisai: రాజీనామాపై స్పందించిన తమిళిసై సౌందరరాజన్
-
Sanjay Singh: ‘ప్రమాణ స్వీకారానికి జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లండి’ - దిల్లీ కోర్టు
-
TS News: హోమ్ ఓటింగ్కు ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి: వికాస్రాజ్
-
సంక్షోభం వేళ నీటి ఆదాకు బెంగళూరు డాక్టర్ ‘4 టిప్స్’.. రోజుకు 600 లీటర్లు సేవ్ చేశారట..!