వరద నీటికి నడక నేర్పేదెప్పుడు?
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరాలు, పట్టణాలు జలమయం అవుతున్నాయి.
ఏటా మునుగుతున్న నగరాలు, పట్టణాలు
కాల్వలు, నాలాల విస్తరణే పరిష్కారమంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరాలు, పట్టణాలు జలమయం అవుతున్నాయి. తక్కువ వ్యవధిలో ఎక్కువ మోతాదులో వర్షం కురిసేసరికి అతలాకుతలం అవుతున్నాయి. హైదరాబాద్లో చెరువుల్లో ఆక్రమణలు వెల్లువెత్తుతున్నాయి. అదేసమయంలో గతంలో ఎప్పుడో తక్కువ జనాభా కోసం రూపొందించిన వరద కాల్వలు, నాలాలే ఇప్పటికీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిసారీ వరదల ముప్పు తప్పడం లేదు. భారీ వర్షాలు కురిసిన ప్రతి సందర్భంలోనూ హడావుడిగా అధ్యయనాలు చేయించడం.. ఆ తరవాత వాటిని దస్త్రాలకే పరిమితం చేయడం పరిపాటిగా మారింది. వర్షాలు పడ్డప్పుడు హడావుడి కాకుండా.. నగరాలు, పట్టణాల్లో వరద నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లో..
రానున్న రోజుల్లో 50 శాతానికిపైగా ప్రజానీకానికి పట్టణాలే ఆవాసాలు కానుండటంతో ద్వితీయ శ్రేణి నగరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించకపోతే అవీ హైదరాబాద్లా మారతాయన్న ఆందోళనను నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రామగుండం, ఖమ్మం నగరాలు ఇబ్బడిముబ్బడిగా విస్తరిస్తున్నాయి. ఆయా నగరాల్లో పూర్తిస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ లేదు. తాజా వర్షాలతో నిజామాబాద్, వరంగల్ నగరాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. రాష్ట్రంలో కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను ప్రభుత్వం పరిరక్షిస్తున్నా.. వాటి నుంచి వచ్చే వరద నీటిని పూర్తిస్థాయిలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు వరంగల్ నగరానికి నాలుగు వైపులా చెరువులున్నాయి. అవి అలుగుపోస్తే పరిస్థితి వర్ణనాతీతం. ఇప్పటికైనా ఆయా నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థను, నాలాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయిదు సెంటీమీటర్లు దాటితే కష్టమే
కుండపోతగా వర్షం కురిస్తే ఎంతటి నగరమైనా తట్టుకోలేదు. గతంలో హైదరాబాద్లో రెండు మూడు సెంటీమీటర్ల వర్షం పడితేనే అస్తవ్యస్తం అయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఇటీవల నాలాలు, వరద కాల్వలను కొంత మేర అభివృద్ధి చేసింది. ఫలితంగా గంట వ్యవధిలో అయిదారు సెంటీమీటర్ల వరకు నగరం తట్టుకోగలుగుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతకుమించి కురిస్తే మాత్రం ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. నగరాలన్నీ సిమెంటు అరణ్యాలు(కాంక్రీట్ జంగిల్స్)గా మారుతుండటంతో నీరు ఇంకిపోయే పరిస్థితి లేదు. కేంద్ర భూగర్భ నీటి బోర్డు(సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు) మార్గదర్శకాల మేరకు నగరాల్లో ప్రత్యేకించి హైదరాబాద్లో వర్షపు నీటిని భూమిలోకి పంపేందుకు ఇంజెక్షన్ వెల్స్ ఒక పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. జేఎన్టీయూ క్యాంపస్లో పదేళ్ల కిందటే వాటిని వేయడంతో ఏటా పది కోట్ల లీటర్ల నీటిని భూగర్భంలోకి పంపుతున్నారు. నాలాలు, వరద కాల్వల విస్తరణను దీర్ఘకాలిక ప్రణాళికగా చేపట్టాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.
బఫర్జోన్లో నిర్మాణాలను అడ్డుకోవాలి
‘తక్కువ సమయంలో ఎక్కువ తీవ్రతతో వర్షాలు కురవడం ఇటీవల కాలంలో పెరిగింది. నగరాల్లో వరదలకు ఇదే ప్రధాన కారణం. నగరాల్లో పూర్తిస్థాయి వరద కాల్వలు లేకపోవడమే పెద్ద సమస్య’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఎం.గోపాల్నాయక్ ‘ఈనాడు’తో చెప్పారు. నాలాలు చెత్తాచెదారాలకు అడ్డాలు కాదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే విషయంలో నీటిపారుదల, ఆర్అండ్బి, నగరపాలక సంస్థలు, జలమండలి సమన్వయంతో వ్యవహరించాలి. బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టకుండా నియంత్రించాలి. వరద నివారణకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాలు అనుసరించాలి. నాలాల సామర్థ్యం పెంచాలి. వరదను తీసుకెళ్లే ప్రధాన కాల్వను గుర్తించి ప్రారంభం నుంచి చివరి వరకు ఆటంకాలు లేకుండా చూడాలి. వీటికి ఇతర కాల్వలను కలపాలి. వరద ఎక్కడికక్కడ చెరువుల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
హడలెత్తించిన హఠాత్తు వాన
అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. -
భూముల ధరలు సవరించాలి
హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రూ.35 వేల కోట్ల సేకరణ ఎలా?
రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి నిధుల సేకరణకు ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీకి రూ.33 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. -
వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు. -
జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్లు
తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో జిల్లా జడ్జి (ఎంట్రీలెవల్) పోస్టుల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
జీవన్రెడ్డి మాల్ని స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
ఎస్పీలు సరే.. కిందిస్థాయి అధికారులపై చర్యలేవీ?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పెద్ద ఎత్తున జరిగిన హింసకాండ, విధ్వంసానికి బాధ్యులుగా తేలుస్తూ ఎన్నికల సంఘం.. ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని బదిలీ చేసింది. -
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు