NMC Chairman: వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు.
అద్దె రోగులు.. ఘోస్ట్ ఫ్యాకల్టీకి ముగింపు
ప్రత్యక్షంగా తనిఖీలు చేశాకే కొత్త కళాశాలలకు అనుమతి
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడంపై ప్రత్యేక దృష్టి
ర్యాగింగ్ నివారణకు కఠిన చర్యలు
పీజీ మెడికల్ సీట్ల పెంపుపై ప్రత్యేక దృష్టి
‘ఈనాడు’తో ఎన్ఎంసీ ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్
ఈనాడు - హైదరాబాద్
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు. వైద్య కళాశాలల్లో ఫేక్ పేషెంట్లు.. ఘోస్ట్ ఫ్యాకల్టీలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల పెంపునకు ప్రాధాన్యం ఇస్తూ అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు చెప్పారు. కొత్త వైద్య కళాశాలలు 50 మంది విద్యార్థులతో ప్రారంభమయ్యేలా నిబంధనలు మార్చామని.. 220 పడకల బోధనాసుపత్రి ఉంటేనే కళాశాల ప్రారంభానికి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభం సమయానికే ఆసుపత్రిలో రోగులకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందే ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆధార్ ఆధారంగా బోధన సిబ్బంది హాజరు నమోదు చేయడం సత్ఫలితాలిస్తోందని చెప్పారు. కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఎన్ఎంసీ విధిగా ప్రత్యక్షంగా తనిఖీలు చేస్తుందన్నారు. అనుమతుల కొనసాగింపు సమయంలో వర్చువల్గా తనిఖీలు చేసినా.. ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. పీజీ మెడికల్ సీట్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వైద్యవిద్య పూర్తి చేసుకుని కళాశాల నుంచి బయటకు వచ్చే సమయానికి పూర్తి నైపుణ్యంతో వైద్యవిద్యార్థి ఉండేలా చూడటమే తమ లక్ష్యమంటున్న ఎన్ఎంసీ ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్తో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. వివరాలు ఆయన మాటల్లోనే..
వైద్య కళాశాలల్లో ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న చర్యలు..?
దేశంలో మరిన్ని మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రాధాన్యమిస్తూనే.. వైద్యవిద్యలో నాణ్యత పెంపుపై దృష్టి సారించాం. కేవలం థియరీ పరీక్షలతో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించడం కాదు. మెడికల్ ప్రాక్టీస్లోని అనేక అంశాల్లో విద్యార్థులు సామర్థ్యం పెంచుకోవడం చాలా కీలకం. ఉన్నత ప్రమాణాలతో కూడిన సిలబస్ను అభివృద్ధి చేసి.. దాన్ని తప్పనిసరిగా అనుసరించేలా చేశాం. విద్యార్థులకు క్లినికల్ ఎక్స్పోజర్ త్వరగా దక్కేలా దృష్టి సారించాం. పాఠ్యాంశాలు నేర్చుకోవడానికే పరిమితం కాకుండా ప్రయోగాత్మక(ప్రాక్టికల్) విజ్ఞానం పెంపునకు ఇది దోహదపడుతుంది. అండర్గ్రాడ్యుయేట్ ప్రీక్లినికల్ ట్రైనింగ్ను క్లినికల్ ట్రైనింగ్లో భాగం చేశాం. వైద్య కళాశాలల్లో స్కిల్ ల్యాబ్లను తప్పనిసరి చేశాం. వీటిలో నైపుణ్యాలు పెంచుకునేందుకు విద్యార్థులకు అవకాశాలుంటాయి.
వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది సామర్థ్యాల పెంపు..?
బోధన సిబ్బంది తమ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం గతం నుంచే అమల్లో ఉంది. దీనికి అదనంగా ఇప్పుడు 40 నుంచి 45 శాతం శిక్షణ అవకాశాలను పెంచాం. వైద్య కళాశాలలు, బోధన సిబ్బంది సంఖ్యలో పెరుగుదలకు అనుగుణంగా శిక్షణ కోసం అనేక కేంద్రాలు ప్రారంభించాం. ప్రధానంగా అడ్వాన్స్డ్ ఏరియాలోనూ శిక్షణ ఇచ్చే అవకాశాలను కల్పించాం.
ర్యాగింగ్ నివారణ..?
వైద్య కళాశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మెంటార్-మెంటీ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ప్రతి కళాశాలలోనూ యాంటీ ర్యాగింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. ర్యాగింగ్ ఏ రూపంలో ఉన్నా... ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు.
పీజీ మెడికల్ సీట్ల కొరత..?
ఎన్ఎంసీ ఏర్పాటైన తర్వాత గత మూడేళ్లుగా పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాం. ఐదేళ్ల క్రితం పరిస్థితి వేరు. ఇప్పుడు అనేక పీజీ సీట్లను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ ఏడాది, గత ఏడాది బ్యాచ్లలోని విద్యార్థులందరూ దాదాపుగా పీజీ సీట్లు పొందేందుకు అవకాశం ఉంది. అయితే పాత బ్యాచ్ల వారు సైతం ప్రయత్నిస్తుండటంతో గట్టి పోటీ ఉంది.
నెక్స్ట్ నిర్వహణ..?
నేషనల్ లెవల్ కాంపిటెన్సీ అసెస్మెంట్ (నేషనల్ ఎగ్జిట్ టెస్ట్-నెక్స్ట్) నిర్వహిస్తే వైద్యవిద్య ప్రమాణాల పెంపులో గేమ్ ఛేంజర్ అవుతుంది. అయితే దీని అమలులో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఒకసారి దీని నిర్వహణ మొదలైతే విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది. అన్ని వైద్య కళాశాలలు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన వైద్యవిద్య అందించేందుకు థర్డ్ పార్టీ ఆడిట్ కూడా ఉంటుంది. దీనిపై ప్రత్యేక కమిటీని నియమించాం. అది అధ్యయనం చేస్తోంది.
మెంటార్-మెంటీ పోగ్రాం ఫలితాలు..?
మెంటార్-మెంటీ కార్యక్రమంలో మెంటార్గా ఉండే బోధన సిబ్బంది నలుగురైదుగురు విద్యార్థులకు లోకల్ గార్డియన్గా వ్యవహరిస్తారు. ఆ విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ.. వారికి అవసరమైన తోడ్పాటు అందిస్తారు. వారు ఎదుర్కొంటున్న ఒత్తిడిని నివారించడంతో పాటు ఇతర అంశాల్లోనూ సహకరిస్తారు. ప్రతి బోధకుడి కింద నాలుగు సంవత్సరాల విద్యార్థులూ ఉంటారు. వారి మధ్య సోదరభావం పెరుగుతుంది. ర్యాగింగ్ వంటి వాటికి అవకాశమూ తగ్గుతుంది.
వైద్య విద్యార్థుల్లో ఆత్మహత్యలు, డ్రాపవుట్లు..?
కౌమార దశ తర్వాత వచ్చే విద్యార్థులు చాలా అంశాలకు ఆకర్షితులు కావడం లేదా వాటి వల్ల ప్రభావితం కావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో ఒత్తిడి స్థాయి తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎన్ఎంసీ ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. విద్యార్థుల్లో ఒత్తిడి స్థాయిని గుర్తించడం, ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారో తెలుసుకోవడం.. ఆత్మహత్యలకు కారణాలు, ఎందుకు డ్రాపవుట్లుగా మారుతున్నారు? వంటి కీలకాంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
రోగులతో వైద్యులు వ్యవహరించాల్సిన తీరు, నైతికత వంటి అంశాలకు ప్రాధాన్యం..?
రోగులతో వైద్యుడు వ్యవహరించాల్సిన తీరుతో పాటు నైతికతను ఒక అంశంగా వైద్యవిద్యలో చేర్చాం. వైద్యవిద్య పూర్తి చేసుకుని బయటకు వచ్చే విద్యార్థి మంచి వైద్యుడిగా సేవలందించేలా ఇది ఉపకరిస్తుంది. వైద్య వృత్తిని కొనసాగించినంత కాలం ఇవి తోడుగా ఉండేలా దృష్టి సారించాం. దీంతో పాటు ఫ్యామిలీ అడాప్షన్ కార్యక్రమమూ అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి వైద్య కళాశాల సమీపంలోని గ్రామంలో నాలుగైదు కుటుంబాలను దత్తత తీసుకుంటారు. నాలుగేళ్ల విద్యాభ్యాసం సమయంలో ఆ కుటుంబాలతో అనుబంధం ఏర్పడుతుంది. ఆ కుటుంబాల అనారోగ్య సమస్యలను గుర్తిస్తారు. వారికి ఆ విద్యార్థులు స్వయంగా వైద్యం చేయరు. ఆసుపత్రి లేదా వైద్య కళాశాలతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల వైద్య విద్యార్థికి అనుభవం వస్తుంది. దీనికంటే ముఖ్యంగా రోగులతో ఎలా మెలగాలో తెలుసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు పూర్తి
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ ఎగువన పిల్లర్ల వద్ద పేరుకుపోయిన ఇసుక తొలగింపు పూర్తి కావస్తోంది. దీంతో ఎన్డీఎస్ఏ అధికారుల పరిశీలనకు, ఇతరత్రా మరమ్మతులకు అనుకూలంగా మారింది. -
సర్వాంగ సుందరంగా ట్యాంక్బండ్ పరిసరాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ట్యాంక్బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. -
రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒకటి.. 13.30 నిమిషాల నిడివితో మరోటి రెండు వర్షన్లుగా ఉంటుంది. -
అవతరణ వేడుకలకు సోనియా గాంధీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. -
అసెంబ్లీలో చర్చించాకే అధికార చిహ్నంపై నిర్ణయం: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా విస్తృతంగా చర్చలు జరపాల్సి ఉందని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. -
ఆదిలాబాద్లో అన్నదాతల ఆందోళన
ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం రైతులు నిరీక్షించి.. విసిగి వేసారి ఆందోళన చేపట్టారు. స్థానిక తాంసి బస్టాండ్ ప్రాంతంలోని ఓ దుకాణం ఎదుట గురువారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో అన్నదాతలు బారులు తీరారు. -
కొన్ని రకాల విత్తనాలపైనే మక్కువ
తెలంగాణలో పత్తి విత్తనాలకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. మార్కెట్లో 25కి పైగా కంపెనీలుండగా.. కొన్ని కంపెనీల విత్తనాలే తమకు కావాలని రైతులు అడుగుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. -
గుట్టలుగా ఔషధ వ్యర్థాలు.. అడిగేవారు లేరు!
కాలంచెల్లిన ఔషధాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించాలి. లేదా సంబంధిత కంపెనీలకు తిరిగి పంపాలి. కానీ! వరంగల్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల పక్కన పారబోస్తున్నారు. -
‘ఉత్పత్తి’ అటకెక్కింది.. ‘వైవిధ్యం’ నీరుగారింది!
నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి వైవిధ్య పథకం అటకెక్కింది. -
కుట్టు కూలి రూ.70కు పెంచేందుకు చర్యలు
మహిళా సంఘాల సభ్యుల ఆర్థికాభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే సర్కారు బడుల్లో ఏకరూప దుస్తుల కుట్టు పని అప్పగించడంతో పాటు వారి కోరిక మేరకు.. -
అసఫ్జాహీల కాలం నాటి వెండి నాణేలు లభ్యం
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లిలో పురాతన వెండి నాణేలు లభ్యమయ్యాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
సౌర విద్యుత్తో ఔరా అనిపించేలా..!
ఏటా వినియోగిస్తున్న విద్యుత్కు చెల్లిస్తున్న రూ.600 కోట్ల బిల్లును ‘సున్నా’కు తగ్గించేందుకు సింగరేణి సంస్థ భారీ ప్రణాళికలు అమలు చేస్తోంది. -
దుబాయిలో హైదరాబాద్ ఐఏఎంసీ చర్చాగోష్ఠి
భారత్, దుబాయి పెట్టుబడిదారుల మధ్య స్నేహపూర్వక వ్యవస్థ ఏర్పాటులో మధ్యవర్తిత్వ, ఫైనాన్స్ సెంటర్ల (ఆర్థిక కేంద్రాల) పాత్ర అనే అంశంపై దుబాయి లోని యుఏఈ బిజినెస్ ఫోరంలో హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్(ఐఏఎంసీ) చర్చాగోష్ఠిని నిర్వహించింది. -
పౌరసరఫరాల శాఖ డీఎస్వో, డీఎం సస్పెన్షన్
మిల్లులకు సీఎంఆర్ కోసం ధాన్యాన్ని కేటాయించిన సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు పౌరసరఫరాల శాఖ అధికారులపై వేటుపడింది. -
తగ్గిన పాఠ్య పుస్తకాల ధరా భారం
రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి పాఠ్య పుస్తకాల ధరలు కనీసం నాలుగో వంతు తగ్గాయి. గత ఏడాదితో పోల్చితే పుస్తకాల ధరలతోపాటు వాటి బరువు కూడా గణనీయంగా పెరిగింది. -
పశు సంవర్ధకశాఖ కొత్త డైరెక్టర్ ఎవరో?
రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో కొత్త డైరెక్టర్ నియామకంపై సందిగ్ధం ఏర్పడింది. ప్రస్తుత సంచాలకురాలు మంజువాణి శుక్రవారం పదవీ విరమణ పొందుతుండగా.. ఈ పోస్టు భర్తీకి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ శాఖలో నెలకొంది. -
గంధంగూడ భూముల ఆక్రమణలో రెవెన్యూ అధికారి పాత్ర
హైదరాబాద్ శివారులోని గంధంగూడ ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. -
ఆహార శుద్ధికి ఊతం
రాష్ట్రంలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం, ఉపాధి కల్పన లక్ష్యాలుగా పెద్ద ఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. -
కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ సతీమణి డాక్టర్ లక్ష్మీబాయి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, దివంగత పుంజాల శివశంకర్ సతీమణి డాక్టర్ లక్ష్మీబాయి(94) హైదరాబాద్ శివారు మామిడిపల్లిలోని నివాసంలో అనారోగ్యంతో గురువారం తుదిశ్వాస విడిచారు. -
చట్టబద్ధ దత్తతతో చిక్కులు దూరం
సంవత్సరాలుగా వేధిస్తున్న సంతానలేమి... అమ్మ పిలుపు కోసం ఆరాటం... బంధుగణానికి తాను తల్లినయ్యానంటూ చెప్పాలనే కోరిక... తండ్రి హోదాలో బిడ్డను వేలుపట్టి నడిపించాలనే తహతహతో కొందరు దంపతులు దళారుల మాటలు నమ్ముతున్నారు. -
కృష్ణా బేసిన్లో తగ్గుతున్న నీటి లభ్యత
కృష్ణా బేసిన్లో తరచూ నీటి లభ్యత తగ్గుతోంది. ప్రస్తుతం ముగియనున్న నీటి సంవత్సరం(జూన్ 1 నుంచి మే 31 వరకు).. శ్రీశైలం చరిత్రలో అతి తక్కువ నీటి లభ్యత ఉన్న సంవత్సరాల్లో రెండోది.
తాజా వార్తలు (Latest News)
-
భారత జీడీపీ 8.2%.. మార్చి త్రైమాసికంలో 7.8%
-
ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా రోహిత్ సొంతం: షకిబ్
-
ఉత్తరాదికి ఎండదెబ్బ.. ఒక్క రోజులో 50 మంది మృతి
-
గొర్రెల పంపిణీ స్కామ్.. మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్
-
గాల్లోని విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్పోర్ట్ కార్యకలాపాలపై ఎఫెక్ట్!
-
ఆకట్టుకునేలా సమంత కొత్త లుక్.. నయనతార ఫ్యామిలీ పిక్స్