Medaram: ‘మేడారం’ మహాజాతరకు 72 రోజులే..
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు వేళవుతోంది. రెండేళ్లకోసారి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు.
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు వేళవుతోంది. రెండేళ్లకోసారి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. ప్రతిసారి కనీసం నాలుగు నెలల ముందు నుంచైనా జాతర నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. మొత్తం 21 శాఖలు రూ.75 కోట్ల విలువైన ప్రతిపాదనలను జులైలోనే సిద్ధం చేశాయి. దాదాపు 5 నెలలు అవుతున్నా నిధులు కేటాయించలేదు. నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులు ఇప్పటికీ పట్టాలెక్కలేదు.
చేపట్టాల్సిన పనులెన్నో..
జాతరలో రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, కల్యాణకట్టలు, చెక్డ్యాంలు, హోల్డింగ్ పాయింట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, డంప్యార్డులు తదితర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. జాతరకు 72 రోజులు మాత్రమే ఉంది.
నిధుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం
నిధుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. మధ్యలో కోడ్ రావడంతో నిధుల కేటాయింపులో ఆలస్యం అయింది. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయ్యాయి. జాతర ఏర్పాట్లపై దృష్టి పెట్టాం. నిధుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. త్వరలోనే పనులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.
అంకిత్, ఐటీడీఏ, పీవో ఏటూరునాగారం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలి: ప్రొ. హరగోపాల్
ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలోని బస్తర్, సుకుమా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండను తక్షణమే నిలిపేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కొలిక్కిరాని ధరణి పెండింగ్ సమస్యలు
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులకు పరిష్కారం లభించడం లేదు. ఈ అంశంపై శనివారం రాష్ట్ర సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైంది. -
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో ఉద్యోగాలు
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో సెంట్రింగ్ (షట్టరింగ్ కార్పెంటర్స్), సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, ఐరన్ బెండింగ్ కార్మికుల ఉద్యోగాలకు ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. -
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ
తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేరుచేసే ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని... నిరంతరాయంగా కంపోస్టు తయారీని కొనసాగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఆదేశించారు. -
ఎన్నికల సమయంలో నగదు జప్తు సబబే
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది అక్టోబరులో మిర్యాలగూడ నుంచి నల్గొండ వెళ్తున్న వాహనంలో సీజ్ చేసిన రూ.3.04 కోట్ల నగదు విడుదలకు, దాని ఆధారంగా నమోదైన కేసు కొట్టివేతకు హైకోర్టు నిరాకరించింది. -
ధాన్యం టెండర్లలో అక్రమాలు.. పెద్ది సుదర్శన్రెడ్డి
గ్లోబల్ టెండర్ల పేరుతో జరిగిన ధాన్యం అమ్మకాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని భారాస మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు