సినీ నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్‌ మృతి

సినీ నేపథ్య, జానపద గాయకుడు, గబ్బర్‌సింగ్‌ సినిమాలోని ‘పిల్లా నువ్వులేని జీవితం’ పాట ఫేం వడ్డేపల్లి శ్రీనివాస్‌(64) కన్నుమూశారు.

Published : 01 Mar 2024 04:08 IST

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: సినీ నేపథ్య, జానపద గాయకుడు, గబ్బర్‌సింగ్‌ సినిమాలోని ‘పిల్లా నువ్వులేని జీవితం’ పాట ఫేం వడ్డేపల్లి శ్రీనివాస్‌(64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌ చిలకలగూడలోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస్‌ వరంగల్‌ జిల్లాలో జన్మించారు. ఆయన చిన్నప్పుడే కుటుంబం హైదరాబాద్‌ వచ్చి స్థిరపడింది. ఆయన జానపద కళాకారుడిగా ప్రాచుర్యం పొందారు. ‘నంది’తో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. ‘పిల్లా నువ్వు లేని’ పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని