తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం

రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Published : 08 May 2024 04:03 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. తడిసిన ధాన్యం గురించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. కల్లాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని, ప్రభుత్వపరంగా సాయమందిస్తామని తెలిపారు. వడగళ్ల వానతో పంట నష్టపోయిన వారికి ఆర్థిక సహకారం అందిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని