26 ఏళ్ల టెక్ సీఈవో.. నేరగాడి చేతిలో హత్యకు గురై..!
Tech CEO Murder: అమెరికాలో ఓ కంపెనీ సీఈవో చిన్న వయసులోనే హత్యకు గురయ్యారు. ఓ కరుడుగట్టిన నేరగాడు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా (USA)లో ఓ యువ టెక్ సీఈవో (Tech CEO) దారుణ హత్యకు గురయ్యారు. బాల్టిమోర్ ప్రాంతంలో ఎకోమ్యాప్ టెక్నాలజీస్ (EcoMap Technologies) కంపెనీ వ్యవస్థాపకురాలు, సీఈఓ పావా లాపెరి (Pava LaPere) గత సోమవారం తన అపార్ట్మెంట్లోనే విగతజీవిగా కన్పించారు. ఓ నేరగాడు ఆమెను హత్య (Murder) చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాల్టిమోర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లాపెరి ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి సోమవారం ఉదయం పోలీసులకు ఓ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఆమె ఫ్లాట్ నుంచి ఎంతకీ బయటకు రావడం లేదని దాని సారాంశం. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అపార్ట్మెంట్ తలుపు తెరిచి చూడగా లాపెరి విగత జీవిగా కన్పించారు. ఆమె తలకు బలమైన గాయమైనట్లు గుర్తించారు. దీని కారణంగానే ఆమె మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
నెల్సన్ మండేలా మనవరాలు కన్నుమూత
ఈమె హత్యకు 32 ఏళ్ల జేసన్ డీన్ బిల్లింగ్స్లే అనే వ్యక్తి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లైంగిక నేరం కేసులో గతంలో శిక్ష అనుభవించిన అతడు.. గతేడాది అక్టోబరులో జైలు నుంచి విడుదలయ్యాడు. అతడు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, అతడి వల్ల హానీ జరగొచ్చని బాల్టీమోర్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అతడి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. అయితే, లాపెరితో జేసన్కు ఎలాంటి పరిచయం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. నేరప్రవృత్తిలో భాగంగానే అతడు ఆమెపై దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
26ఏళ్ల లాపెరి.. 2018లో ఎకోమ్యాప్ టెక్నాలజీస్ పేరుతో స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. తక్కువకాలంలోనే ఈ కంపెనీకి మంచిపేరొచ్చింది. మెటా వంటి దిగ్గజ సంస్థలకు ఈ కంపెనీ సేవలందిస్తోంది. దీంతో ఈ ఏడాది ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘30 అండర్ 30’ జాబితాలో లాపెరి చోటు దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హఫీజ్ అనుచరుడు అద్నాన్ అహ్మద్ కాల్చివేత
వరుసగా జరుగుతున్న హత్యలతో పాకిస్థాన్లో ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. -
తొందరగా ఎదిగితే ఆరోగ్యం చిందరవందర!
పదమూడేళ్లకు ముందే రజస్వల అయిన బాలికలు నడి వయసులో టైప్-2 మధుమేహానికి గురయ్యే ముప్పు ఎక్కువని అమెరికన్ పరిశోధకులు కనుగొన్నారు. -
ఓజోన్ కాలుష్యం పెరిగినా అధిక దిగుబడులు
భూ ఉపరితలానికి దగ్గరగా ఓజోన్ కాలుష్యం పెరిగినా దాన్ని తట్టుకునే శక్తి కొన్ని రకాల పంటలకు ఉందని భారత్, అమెరికా, చైనాల్లో 20 ఏళ్లపాటు జరిగిన ప్రయోగాలు నిర్ధారించాయి. -
అప్పుడెందుకు మౌనంగా ఉన్నారు?
హమాస్ ఉగ్ర దాడికి ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ, మహిళా హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
దుబాయ్లో పుతిన్.. యూఏఈ, సౌదీ పాలకులతో భేటీ
ఉక్రెయిన్పై యుద్ధంతో బిజీబిజీగా ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాన్నాళ్ల తర్వాత తొలిసారిగా పశ్చిమాసియా దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్(యూఏఈ)ల్లో బుధవారం పర్యటించారు. -
భారత హజ్, ఉమ్రా యాత్రికులకు వెసులుబాట్లు
భారత్ నుంచి హజ్, ఉమ్రా యాత్రల కోసం మక్కా, మదీనాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సౌదీ అరేబియా పలు వెసులుబాట్లు కల్పించినట్లు సౌదీ అరేబియా హజ్, ఉమ్రా విభాగ మంత్రి తౌఫిగ్ అల్ రబియా తెలిపారు. -
సూయెజ్ కాలువలో వంతెనను ఢీకొట్టిన రవాణా నౌక
ప్రపంచ వాణిజ్య రవాణాలో అత్యంత కీలకమైన ఈజిప్టులోని సూయెజ్ కాలువలో బుధవారం ఓ నౌక ప్రమాదానికి గురైంది. -
అవును.. కొవిడ్ సమయంలో సరిగా స్పందించలేదు
కొవిడ్ వైరస్ తీవ్రతను తమ ప్రభుత్వం తక్కువ అంచనా వేసిందని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. -
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బుధవారం అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
రోదసిలోకి జంతువులను మోసుకెళ్లే క్యాప్సూల్ను ప్రయోగించాం
సమీప భవిష్యత్తులో మానవసహిత అంతరిక్ష యాత్రలు చేపట్టే దిశగా తాము కీలక ముందడుగు వేసినట్లు ఇరాన్ తెలిపింది. -
శిలాజ ఇంధనాలకు స్వస్తి చెబుదాం
ఐక్యరాజ్య సమితి కాప్-28 సదస్సులో వాతావరణ చర్చలపై తొలి రోజు గణనీయమైన పురోగతి కనిపించినా ఆ తరువాత పరిస్థితి ముందుకూ వెనక్కూ అన్నట్లు ఊగిసలాడుతోంది. -
భీకర భూతల పోరు
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ దళాల మధ్య భీకర భూతల పోరు సాగుతోంది. ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు ఈ పోరు విస్తరించడంతో ప్రజలు భీతావహులై పోతున్నారు. -
కిమ్ కంటతడి!
ఉత్తర కొరియా అధినేత కిమ్జోంగ్ ఉన్ పేరు వినగానే ఆయన నియంతృత్వ వైఖరే గుర్తొస్తుంది. -
ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో భారతీయుడి మృతి
ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖుస్దీప్ సింగ్ అనే భారతీయుడు దుర్మరణం పాలయ్యారు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం