Bird flu: 53 ఏళ్ల వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ..!
పక్షుల్లో కనిపించే బర్డ్ ఫ్లూ వ్యాధి ఇప్పుడు మానుషులకు సంక్రమిస్తోంది. చిలీలో 53 వ్యక్తిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడటంతో తొలి కేసుగా నమోదు చేశారు.
చిలీ: సాధారణంగా పక్షులకు సంక్రమించే బర్డ్ ఫ్లూ (Bird flu) వ్యాధి ప్రస్తుతం మానవుల్లో కూడా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్, చైనాలో ఈ రకమైన కేసులు నమోదుకాగా.. తాజాగా చిలీ ( Chile)లో మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. 53 ఏళ్ల వ్యక్తిలో ఈ వ్యాధికి సంబంధించిన అనేక లక్షణాలు బయటపడ్డాయి. దేశంలో బుధవారం మొదటి కేసు నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health ministry) వెల్లడించింది. వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. ఇది ఒక అంటువ్యాధి అని, కోళ్లు వంటి పక్షులు, సముద్ర జీవుల నుంచి ఈ వ్యాధి మానవులకు సంక్రమిస్తోందని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే మనిషి నుంచి మనిషి సంక్రమిస్తుందా ? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో వ్యాధి సోకిన వ్యక్తితో పరిచయం ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
వన్య జంతువుల్లో H5N1 బ్లడ్ఫ్లూ లక్షణాలు ఉన్నయానే విషయాన్ని చిలీ గతేడాది నివేదించింది. కేసుల సంఖ్య పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం ఇటీవల కోళ్ల పరిశ్రమల నుంచి ఎగుమతులను సైతం నిలిపివేసింది. అర్జెంటీనాలోని పౌల్ట్రీలో కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగుమతిదారు బ్రెజిల్లో మాత్రం ఈ వ్యాధి కేసులు నమోదు కాకపోవడం ఆశ్చర్యకరం. ఈ ఏడాది ప్రారంభంలో ఈక్వెడార్లోని 9ఏళ్ల బాలికలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. పరిశీలించిన అధికారులు ఇది ఇతర వ్యక్తుల నుంచి సంక్రమించిందని ధృవీకరించారు. అయితే మానవుల మధ్య సంక్రమణ వ్యాప్తి ప్రభావం తక్కువగా ఉందని గ్లోబల్ హెల్త్ అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ తయారీదారులు మానవుల కోసం బర్డ్ ఫ్లూ టీకాలను తయారు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.