Covid Deaths: అమెరికాలో 10లక్షల కొవిడ్ మరణాలు..!
కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అంతర్జాతీయ సమాజానికి నిబద్ధత అవసరమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
అమెరికా, ఆఫ్రికాల్లో వైరస్ ఉద్ధృతి తగ్గలేదన్న డబ్ల్యూహెచ్ఓ
వాషింగ్టన్: కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అంతర్జాతీయ సమాజానికి నిబద్ధత అవసరమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది దుఃఖానికి కారణమైన విషయంలో నిస్సత్తువగా ఉండకూడదన్న ఆయన.. ఈ గాయాలను గుర్తుంచుకోవడంతోపాటు వీలైనన్ని ప్రాణాలను రక్షించుకునేందుకు సాధ్యమైనంతవరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో కొవిడ్ మరణాల సంఖ్య 10లక్షల దాటిన నేపథ్యంలో మాట్లాడిన జో బైడెన్.. కొవిడ్ లక్షల కుటుంబాల్లో విషాదం నింపిందన్నారు.
ఆ రెండు చోట్ల తగ్గని ఉద్ధృతి : WHO
అమెరికా, ఆఫ్రికా దేశాలు మినహా విశ్వ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా గతవారం 35లక్షల కరోనా కేసులు నమోదుకాగా 25వేల మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపింది. అంతకుముందుతో పోలిస్తే కేసుల్లో 12శాతం, మరణాల్లో 25శాతం తగ్గుదల కనిపించినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికాలో 14శాతం, ఆఫ్రికాలో 12శాతం కేసులు పెరిగినట్లు తాజా నివేదికలో పేర్కొంది.
చాలా దేశాల్లో కొవిడ్ విజృంభణ తగ్గినట్లు చెప్పినప్పటికీ మొత్తంగా 50దేశాల్లో మాత్రం కొవిడ్ ఉద్ధృతి పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించారు. ఇందుకు ఒమిక్రాన్, దాని ఉపరకాలు కారణమవుతున్నాయని అన్నారు. కొవిడ్ను ఎదుర్కొనే రోగనిరోధకత ఆస్పత్రి చేరికలు, మరణాలను నిరోధిస్తున్నప్పటికీ వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీని తీవ్రత ఎక్కువగానే ఉంటోందన్నారు. ఇప్పటివరకు కేవలం 16శాతం పేద దేశాలకు మాత్రమే వ్యాక్సిన్ అందిన విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ గుర్తుచేశారు.
చైనాలో 145శాతం పెరుగుదల
ఇక కరోనా వైరస్కు పుట్టినిళ్లైన చైనాలో మాత్రం కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గతవారం రోజుల్లో అక్కడి కొవిడ్ కేసుల్లో 145శాతం పెరుగుదల కనిపించినట్లు డబ్ల్యూహెచ్ఓ వారాంతపు నివేదికలో పేర్కొంది. అయితే, కొవిడ్ కట్టడికి చైనా అనుసరిస్తోన్న జీరో కొవిడ్ వ్యూహంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్.. ఇది ఎక్కువకాలం నిలుస్తుందని భావించడం లేదన్నారు. వైరస్ కట్టడికి పలు నగరాల్లో కఠిన లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్ ఉద్ధృతిని మాత్రం చైనా నియంత్రించలేకపోతున్న నేపథ్యంలో టెడ్రోస్ ఈవిధంగా మాట్లాడారు. మరోవైపు ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు