USA: ఇరాన్ పేలుళ్ల వేళ.. అమెరికాలో క్యాపిటల్ భవనాలకు బాంబు బెదిరింపులు
USA: అమెరికాలోని పలు రాష్ట్రాల క్యాపిటల్ భవనాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు వాటిని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా (USA)లో బాంబు బెదిరింపులు (Bomb Threats) తీవ్ర కలకలం రేపుతున్నాయి. పలు రాష్ట్రాల క్యాపిటల్ భవనాల (state capitols)కు ఈ బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని ఖాళీ చేయించారు. ఇరాన్లో భీకర పేలుళ్ల వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జార్జియా, కనెక్టికట్, కెంటుకీ, మిషిగాన్, మిన్నెసోటా, మిసిసిపీ, మోంటానా, మైన్, హవాయి రాష్ట్రాల క్యాపిటల్ భవనాలకు బుధవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని ఈ-మెయిల్ ఐడీ నుంచి ఒకేసారి అన్ని ఆఫీసులకు ఈ సందేశాలు చేరినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తక్షణమే ఆ భవనాలను ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. అవి నకిలీ బెదిరింపులని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) తెలిపింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.
ఇరాన్ రక్తసిక్తం.. జంట పేలుళ్లలో 103 మంది దుర్మరణం
ఇటీవల అమెరికాలో ప్రాంక్ కాల్స్ బెడద తీవ్రమైంది. ప్రభుత్వ అధికారుల ఇళ్లల్లో కాల్పులు జరిగాయంటూ కొంతమంది పోలీసులకు ఫోన్ చేసి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. క్రిస్మస్ రోజున రిపబ్లికన్ చట్టసభ్యుడి ఇంట్లో కాల్పులు జరిగినట్లు వచ్చిన నకిలీ ఎమర్జెన్సీ కాల్ కలకలం సృష్టించింది. ఆ తర్వాత ట్రంప్ను ప్రైమరీ పోరు నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకొన్న మైన్ రాష్ట్ర సెక్రటరీ (ఎన్నికల అధికారి) షెన్నా బెల్లోస్కు కూడా ఇలాగే ప్రాంక్ కాల్స్ చేశారు. తాజా ఘటన కూడా ఆ కోవలోనిదే అని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు ఇరాన్లో బుధవారం జంట పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల కిందట అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ సమాధి వద్ద నివాళులర్పించేందుకు భారీగా జనం తరలివచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్, అమెరికా హస్తం ఉందంటూ ఇరాన్ ఆరోపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
స్లొవేకియా ప్రధాని రాబర్డ్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. -
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
హాలివుడ్ సినిమా తరహాలో ఓ గ్యాంగ్ సభ్యులు డ్రగ్లార్డ్ను విడిపించుకుపోయారు. జైలు వాహన కాన్వాయ్పై ఆటోమేటిక్ ఆయుధాలు, ఖరీదైన ఎస్యూవీతో దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి