H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు కెనడా గుడ్న్యూస్..
అమెరికన్ హెచ్-1బీ వీసాదారులు (H 1B Visa) తమ దేశానికి వచ్చి, ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా కెనడా కొత్త ప్రోగ్రామ్ తీసుకొస్తోంది.
ఒట్టావా: అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారుల (H 1B Visa)కు కెనడా (Canada) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10వేల మంది హెచ్-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఓపెన్ వర్క్-పర్మిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ వెల్లడించారు. అంతేగాక, ఈ ప్రొగ్రామ్ కింద హెచ్-1బీ వీసాదారుల కుటుంబసభ్యులు చదువుకోవడం, పనిచేసేందుకు అనుమతి కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ సేవల శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
‘‘హైటెక్ రంగాలకు చెందిన కొన్ని కంపెనీలు అమెరికా (USA), కెనడా (Canada) రెండు దేశాల్లోనూ పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో చాలా మంది హెచ్-1బీ వీసాదారులే (H 1B Visa Holders). జులై 16, 2023 నాటికి హెచ్-1బీ వీసాలో అమెరికాలో పనిచేస్తున్నవారు, ఈ వీసాదారులతో వచ్చే కుటుంబసభ్యులు కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు.
కాగా, ఈ కొత్త ప్రోగ్రామ్ కింద.. ఆమోదం పొందిన హెచ్-1బీ వీసాదారులకు మూడేళ్ల కాలావధితో ఓపెన్ వర్క్ పర్మిట్ (Open Work Permit) లభిస్తుంది. వారు కెనడాలో ఎక్కడైనా, ఏ యజమాని వద్దనైనా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం వెల్లడించింది. ఇక, వారి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు కూడా కెనడాలో ఉద్యోగం లేదా చదువుకునేందుకు తాత్కాలిక నివాస వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఇమ్మిగ్రేషన్ స్ట్రీమ్ను అందుబాటులోకి తీసుకొస్తామని ఇమ్మిగ్రేషన్ మంత్రి ఫ్రేజర్ వెల్లడించారు. అయితే, ఈ స్ట్రీమ్ కింద దరఖాస్తు చేసుకునేందుకు ఎవరెవరు అర్హులు అనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు.
టెక్నాలజీ సహా కొన్ని ప్రత్యేక రంగాల్లో అమెరికా (America)లో ఉద్యోగం చేసేందుకు వీలుగా విదేశీయులకు హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటారు. వీరిలో అత్యధికంగా భారతీయులే ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో అమెరికాలో చాలా కంపెనీలు లేఆఫ్లు చేపట్టడంతో ఈ హెచ్-1బీ వీసాదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరంతా అమెరికాలో కొనసాగాలంటే వేరే ఉద్యోగాలు వెతుక్కోక తప్పని పరిస్థితి నెలకొంది. అలాంటి వారికి ఈ కెనడా ఆఫర్ ఉపయోగపడే అవకాశముందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ