China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
ఉగ్రవాద నిర్మూలనకు ఐరాస వేదికగా భారత్ (India), అమెరికా (US) చేస్తోన్న ప్రయత్నాలకు చైనా(China) మరోసారి మోకాలొడ్డింది. జైషే మహ్మద్ ఉగ్ర ముఠా చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar)
యునైటెడ్ నేషన్స్: ఉగ్రవాద నిర్మూలనకు ఐరాస (United Nations) వేదికగా భారత్ (India), అమెరికా (US) చేస్తోన్న ప్రయత్నాలకు చైనా(China) మరోసారి మోకాలడ్డింది. జైషే మహ్మద్ ఉగ్ర ముఠా చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) సోదరుడు అబ్దుల్ రౌఫ్ అజార్ (Abdul Rauf Azhar) పై ఆంక్షలు విధిస్తూ అమెరికా, భారత్ చేసిన ప్రతిపాదనను డ్రాగన్ అడ్డుకుని ఉగ్రవాదంపై తన ద్వంద్వ వైఖరిని మరోసారి ప్రదర్శించింది.
అబ్దుల్ రౌఫ్ అజార్ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చడంతో పాటు అతడి ఆస్తులను స్తంభింపజేయడం, అతడి ప్రయాణాలపై నిషేధం వంటి ఆంక్షలు విధించాలని అమెరికా, భారత్ ప్రతిపాదించాయి. ఐరాస భద్రతా మండలిలో 15 శాశ్వత సభ్య దేశాలుండగా.. 14 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి. ఒక్క చైనా (China) మాత్రం దీన్ని ‘హోల్డ్’లో పెట్టి అడ్డుకుంది. దీంతో అబ్దుల్ రౌఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.
కాగా.. పాకిస్థాన్ ఉగ్రవాదులపై నిషేధం తీసుకొచ్చేలా అమెరికా, భారత్ చేస్తోన్న ప్రయత్నాలకు చైనా అడ్డుపుల్ల వేయడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది జూన్లో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనకు కూడా చైనా చివర్లో అడ్డుపడింది. అంతకుముందు జేషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ను ఈ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రతిపాదించగా.. చైనా ఇదే విధంగా పలుమార్లు అడ్డుపడింది. అజార్ కార్యకలాపాలపై మరింత సమాచారం అవసరమైనందునే అడ్డుకుంటున్నట్లు సమర్థించుకుంది. అయితే చివరకు, అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో చైనా వెనక్కి తగ్గడంతో అజార్ను 2019లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు.
ఎవరీ అబ్దుల్ రౌఫ్ అజార్..
మసూద్ అజార్ సోదరుడైన అబ్దుల్ రౌఫ్ 1974లో పాకిస్థాన్లో జన్మించాడు. జైషే ముఠాలో అత్యంత కీలక వ్యవహరించే రౌఫ్ పాకిస్థాన్లో యువతను ఉగ్రవాదం దిశగా ప్రేరేపించాడు. అనేక ఉగ్రదాడులకు కుట్రలు పన్నడమే గాక, స్వయంగా దాడులకు పాల్పడ్డాడు. 1999లో అఫ్గానిస్థాన్లోని కాందహార్లో భారత విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో రౌఫ్ ప్రధాన సూత్రధారి. ఆ తర్వాత 2001లో భారత పార్లమెంట్పై ఉగ్రదాడి, 2016లో పంజాబ్లోని పఠాన్కోట్లో భారత వాయుసేన స్థావరంపై దాడికి పథకం రచించింది కూడా ఇతడే. 2010లో అమెరికా అతడిపై ఆంక్షలు విధించింది. రౌఫ్ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని 2009లో భారత్ సొంతంగా ప్రతిపాదనలు చేసింది. ఆ తర్వాత 2016లో అమెరికా, యూకే, ఫ్రాన్స్లతో కలిసి ప్రతిపాదనలు తీసుకొచ్చింది. అయితే వీటన్నింటిని కూడా చైనానే అడ్డుకోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.