Mystery Hepatitis: చిన్నారుల్లో ఆ మిస్టరీ వ్యాధికి కరోనానే కారణమా..?
కరోనా వైరస్ను నుంచి కోలుకుంటోన్న పలు దేశాలను ఇటీవల ఓ అంతుచిక్కని కాలేయ వ్యాధి కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే.
ముమ్మరంగా కొనసాగుతోన్న పరిశోధనలు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ నుంచి కోలుకుంటోన్న పలు దేశాలను ఇటీవల ఓ అంతుచిక్కని కాలేయ వ్యాధి కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. ఐరోపా, అమెరికా చిన్నారుల్లో వెలుగు చూస్తోన్న కాలేయ వ్యాధిపై కారణాలను విశ్లేషిస్తున్నప్పటికీ అది ఒక మిస్టరీగానే మారింది. అయితే, దీనిపై ఇప్పటికే ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గుర్తించని కొవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల సంభవించే దుష్ప్రభావాలు పిల్లల్లో తీవ్రమైన కాలేయ వ్యాధికి కారణం కావచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఎక్కువ మంది బాధిత చిన్నారుల్లో ఓ రకమైన అడినోవైరస్ను గుర్తించినప్పటికీ వీటిపై ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అయితే, ఇందుకు సంబంధించిన అధ్యయనం అంతర్జాతీయ జర్నల్లో విశ్లేషణకు రావాల్సి ఉంది.
కరోనా వైరస్ బారినపడిన చిన్నారులు కాలేయ వ్యాధుల బారినపడే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. అయినప్పటికీ ఇటీవల తీవ్ర కాలేయ వ్యాధి బారినపడిన పిల్లలకు గతంలో కరోనా వైరస్ సోకిన దాఖలాలు కనిపించలేదు. అయితే, వారిలో మెజారిటీ పిల్లలకు మాత్రం కాలేయంపై దాడి చేసే 41ఎఫ్ అనే అడినోవైరస్ సోకినట్లు నిపుణులు గుర్తించారు. ఎక్కువ మంది చిన్నారుల్లో కొవిడ్ వెలుగు చూడనప్పటికీ లక్షణాలను గుర్తించలేకపోయి ఉండవచ్చని ది లాన్సెట్ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే జీర్ణాశయ మార్గంలో అడినోవైరస్-42ఎఫ్ ప్రభావం కాలేయాన్ని దెబ్బతీయవచ్చన్నారు. ఈ నేపథ్యంలో కాలేయ వ్యాధితో బాధపడుతోన్న చిన్నారుల మలం ద్వారా వారిలో ఏ మేరకు కరోనా వైరస్ ఉందో తెలుసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 450 కేసులు..
ఇదిలాఉంటే, కరోనా వైరస్ విజృంభణతో గత రెండేళ్లుగా సతమతమవుతోన్న ప్రపంచ దేశాలకు ఇటీవల ఓ అంతుచిక్కని వ్యాధి కలవరానికి గురిచేసింది. ఐరోపా, అమెరికాలో చిన్నారుల్లో వెలుగు చూస్తోన్న ఈ కాలేయ వ్యాధికి సంబంధించి ఇప్పటికే 450 కేసులు నమోదయ్యాయి. ఒక నెల వయసు నుంచి 16ఏళ్ల లోపు పిల్లల్లోనే నమోదవుతున్న ఈ వ్యాధి తీవ్రత వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యం పాలైన మొత్తం బాధిత చిన్నారుల్లో 17 మందికి కాలేయ మార్పిడి అవసరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. ఇలా పిల్లల్లో మిస్టరీగా మారిన ఈ వ్యాధిపై డబ్ల్యూహెచ్ఓతోపాటు అంతర్జాతీయంగా పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ కచ్చితమైన కారణాలను ఇంకా గుర్తించలేకపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు