America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. షికాగో సమీపంలోని హైలాండ్‌ పార్క్‌లో స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌ జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులుకు దిగాడు.

Updated : 05 Jul 2022 00:34 IST

అమెరికా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. షికాగో సమీపంలోని హైలాండ్‌ పార్క్‌లో స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌ జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులుకు దిగాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా, 24 మంది గాయపడ్డారు. పరేడ్‌ జరగుతుండగా సమీపంలోని ఓ రిటైల్‌ స్టోర్‌పై నుంచి సాయుధుడు కాల్పులకు దిగాడు. దీంతో అక్కడున్నవారు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనతో తలోదిక్కుగా పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని