శరీర బరువునూ, మధుమేహాన్నీ తగ్గించే రసాయనం
బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకోకుండానే స్థూలకాయాన్నీ, మధుమేహాన్నీ తగ్గించడానికి తోడ్పడే కొత్త రసాయనాన్ని రాబర్ట్ డాయల్, క్రిస్టియన్ రాత్ అనే అమెరికన్ పరిశోధకులు కనుగొన్నారు.
వాషింగ్టన్: బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకోకుండానే స్థూలకాయాన్నీ, మధుమేహాన్నీ తగ్గించడానికి తోడ్పడే కొత్త రసాయనాన్ని రాబర్ట్ డాయల్, క్రిస్టియన్ రాత్ అనే అమెరికన్ పరిశోధకులు కనుగొన్నారు. ఈ రసాయనం లేదా పెప్టైడ్ శరీర బరువుతోపాటు మధుమేహాన్నీ తగ్గిస్తుంది. బేరియాట్రిక్ శస్త్రచికిత్స తరువాత ఉదరంలో గ్లూకగాన్ తరహా పెప్టైడ్-1 (జీఎల్పీ-1), పెప్టైడ్ వైవై (పీవైవై) అనే హార్మోన్ల స్థాయులు మారతాయి. దానివల్ల కొంచెం తిన్నా కడుపు నిండిపోయి ఆకలి తీరిన అనుభూతి కలిగి, తద్వారా రక్తంలో చక్కెర శాతం తగ్గిపోతుంది. క్లోమ గ్రంథిలో, మెదడులో జీఎల్పీ-1 రిసెప్టర్లను ప్రేరేపించి కడుపు నిండిపోయిన అనుభూతిని కలిగించే లిరాగ్లుటైడ్ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. జీఎల్పీ-1ను మాత్రమే ప్రేరేపించే లిరాగ్లుటైడ్ ఇంజెక్షన్ కన్నా మూడు రెట్లు ఎక్కువ బరువును తగ్గించే జీఈపీ-44 పెప్టైడ్ను డాయల్ బృందం రూపొందించింది. అది జీఎల్పీ-1తోపాటు పీవైవై రిసెప్టార్లనూ ప్రేరేపించి 80 శాతం తక్కువ తిండితోనే సరిపెట్టుకునేట్లు చేస్తుందని ఎలుకల మీద పరిశోధనలు తేల్చాయి. లిరాగ్లుటైడ్ మాదిరిగా ఈ పెప్టైడ్ వాంతులు, తలతిరుగుడు వంటి ప్రభావాలను కలిగించదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.