తైవాన్పై చైనాకు పునరాలోచన లేదు
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం తర్వాత పరిణామాలను చూసి తైవాన్పై ఆక్రమణ విషయంలో చైనా పునరాలోచనలో పడిందనే ప్రచారం ఏమాత్రం నిజం కాదని బ్రిటన్కు చెందిన ‘ది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్’ (ఐఐఎస్ఎస్) సంస్థ నివేదిక తేల్చిచెప్పింది.
బ్రిటన్ సంస్థ నివేదిక
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం తర్వాత పరిణామాలను చూసి తైవాన్పై ఆక్రమణ విషయంలో చైనా పునరాలోచనలో పడిందనే ప్రచారం ఏమాత్రం నిజం కాదని బ్రిటన్కు చెందిన ‘ది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్’ (ఐఐఎస్ఎస్) సంస్థ నివేదిక తేల్చిచెప్పింది. తైవాన్పై దాడికి సంబంధించి బీజింగ్ వైఖరిలో లేదా వ్యూహంలో ఏమాత్రం మార్పులేదని పేర్కొంది. ఈ వారాంతంలో ఐఐఎస్ఎస్ ప్రతిష్ఠాత్మక షంగ్రి-లా చర్చలను సింగపూర్లో నిర్వహించనుంది. ఈ సమయంలో నివేదికను విడుదల చేయడం గమనార్హం. యుద్ధం.. ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో దాని ప్రకంపనలు, అమెరికా - చైనా మధ్య పెరుగుతున్న పోటీ అన్న అంశాలపై ప్రధానంగా ఈ సదస్సులో చర్చ జరగనుంది. అమెరికా విదేశాంగ మంత్రి లాయిడ్ ఆస్టిన్, చైనా రక్షణమంత్రి లీ షాంగ్ఫూ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ తదితరులు దీనికి హాజరు కానున్నారు. బీజింగ్ దృష్టిలో తైవాన్ ఓ అంతర్గత సమస్య అని శుక్రవారం ఐఐఎస్ఎస్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. దీంతో తైవాన్ స్వాధీనానికి బలగాలను ఉపయోగించడం.. ఉక్రెయిన్ యుద్ధానికి భిన్నంగా ఉంటుందని బీజింగ్ అభిప్రాయపడుతోందని వెల్లడించింది. ఇప్పటికే చైనా సైనిక నిపుణులు.. ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల మద్దతును, రష్యా సైన్యం పేలవమైన పనితీరును విశ్లేషించారని తెలిపింది. చైనా భవిష్యత్తులో తైవాన్ విలీనానికి బలప్రయోగం చేస్తుందని కచ్చితంగా చెప్పలేమని నివేదిక పేర్కొంది. బీజింగ్ సైనిక వ్యూహకర్తలు కేవలం సైనిక బలం ఆధారంగా నిర్ణయాలు తీసుకోరని.. వారు అమెరికా, దాని మిత్రదేశాల సైనికేతర స్పందనలను కూడా పరిగణనలోకి తీసుకొంటారని తెలిపింది. తైవాన్ ఆక్రమణకు కచ్చితమైన కాలపట్టిక లేదని నివేదిక పేర్కొంది. షంగ్రి-లా సదస్సు సందర్భంగా అమెరికా, చైనా రక్షణ మంత్రులు భేటీ అయ్యే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. గురువారం అమెరికా రక్షణమంత్రి ఆస్టిన్ మాట్లాడుతూ.. ఈ సదస్సులో ఇరు దేశాల మంత్రుల సమావేశానికి చైనా తిరస్కరించిందని వెల్లడించారు. ఇలాంటి సమన్వయలోపం.. చిన్న పరిణామాలు కూడా పూర్తిగా అదుపు తప్పేలా చేస్తుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.