భారత్‌లో వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్యం: అమెరికా

భారతదేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా వర్ధిల్లుతోందని, దిల్లీని సందర్శించిన వారెవరైనా ఈ సంగతిని స్వయంగా వీక్షించవచ్చని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ఉద్ఘాటించింది.

Published : 07 Jun 2023 04:04 IST

వాషింగ్టన్‌: భారతదేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా వర్ధిల్లుతోందని, దిల్లీని సందర్శించిన వారెవరైనా ఈ సంగతిని స్వయంగా వీక్షించవచ్చని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ఉద్ఘాటించింది. భారత్‌లో ప్రజాస్వామ్య పటిష్ఠత గురించిన అనుమానాలను అలా పటాపంచలు చేసింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలో అమెరికాలో అధికారికంగా పర్యటించనున్న నేపథ్యంలో శ్వేతసౌధం ప్రకటన ప్రాముఖ్యం సంతరించుకుంది. మోదీ పర్యటన భారత్‌-అమెరికాల మధ్య మరింత పటిష్ఠమైన స్నేహం, భాగస్వామ్యాలకు బాటలు వేస్తుందని ఆశిస్తున్నట్లు శ్వేతసౌధంలో జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్‌ కిర్బీ విలేకరులకు చెప్పారు. భారత్‌ ఇప్పటికే అనేక స్థాయుల్లో అమెరికాకు బలమైన భాగస్వామి అని చెప్పారు. క్వాడ్‌లో భాగస్వామిగా భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందని, రెండు దేశాల మధ్య వాణిజ్యం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ద్వైపాక్షికంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారత్‌, అమెరికాలు కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని