సరిహద్దుల్లో శాంతి నెలకొల్పుదాం
సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుదామని, తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంట ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని, అప్పుడే రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
వాస్తవాధీన రేఖను గౌరవిద్దాం
అప్పుడే రెండు దేశాల సంబంధాల్లో సాధారణ స్థితి
జిన్పింగ్కు మోదీ స్పష్టీకరణ
బ్రిక్స్లోకి మరో 6 దేశాలు
జొహన్నెస్బర్గ్: సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుదామని, తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంట ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని, అప్పుడే రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖను గౌరవించుకోవడం అవసరమని, సరిహద్దుల్లో శాంతి, సోదరభావంతో మెలుగుదామని సూచించారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల సందర్భంగా బుధవారం జిన్పింగ్, మోదీ మాట్లాడుకున్నారని గురువారం భారత విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు. సరిహద్దుల్లో త్వరితగతిన సైనిక బలగాల ఉపసంహరణ చర్యలను చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలివ్వాలని ఇరువురు నేతలు ఒక అంగీకారానికి వచ్చారని తెలిపారు. జీ-20 సదస్సుకు జిన్పింగ్ను మోదీ ఆహ్వానించారా అన్న ప్రశ్నకు క్వాత్రా సమాధానమివ్వలేదు. గురువారం బ్రిక్స్ సదస్సు వేదిక వద్దకు వెళ్లేటప్పుడూ మోదీ, జిన్పింగ్ మాట్లాడుకున్నారు. సంయుక్త విలేకరుల సమావేశం అనంతరం క్లుప్తంగా మాట్లాడుకున్నారని, కరచాలనం చేసుకున్నారంటూ అందుకు సంబంధించిన వీడియోను దక్షిణాఫ్రికా అధికార వార్తా ఛానల్ ఎస్ఏబీసీ ప్రసారం చేసింది. గత ఏడాది నవంబరులో జీ-20 సదస్సు తర్వాత వారిద్దరు మాట్లాడుకోవడం ఇదే ప్రథమం.
- ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో పాశ్చాత్య ఆధిపత్యాన్ని సవాలు చేసేదిగా భావిస్తున్న వర్ధమాన దేశాల కూటమి బ్రిక్స్ మరింత బలోపేతం దిశగా అడుగులు వేసింది. ప్రస్తుతం భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకే పరిమితమైన ఈ కూటమిలోకి కొత్తగా మరో ఆరు దేశాలు చేరనున్నాయి. 2024 జనవరి 1 నుంచి అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్లో చేరతాయి. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో మూడు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ సదస్సు విస్తరణపై నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వర్చువల్గా హాజరయ్యారు. ‘బ్రిక్స్ విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలు, ప్రమాణాలు, విధానాలపై చర్చించాం. తొలిదశ విస్తరణకు ఏకాభిప్రాయం కుదిరింది. ఆరు దేశాలను పూర్తి స్థాయి సభ్యులుగా బ్రిక్స్లోకి ఆహ్వానిస్తున్నాం’ అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా వెల్లడించారు.
- బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదం అంశంపై చైనాకు కాసింత ఇరకాటం ఎదురైంది. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో ద్వంద్వ ప్రమాణాలను అంగీకరించేది లేదని బ్రిక్స్ సదస్సు కుండబద్దలు కొట్టింది.
పూర్తి మద్దతు: మోదీ
బ్రిక్స్ విస్తరణకు ఆమోదం తెలిపిన భారత్.. దీన్నుంచి ఐరాసలాంటి ప్రపంచ సంస్థలన్నీ పాఠం నేర్చుకోవాలని పరోక్షంగా ఎత్తిచూపింది. ‘బ్రిక్స్ విస్తరణ, ఆధునికీకరణను చూసి.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారాలో ప్రపంచ సంస్థలన్నీ గుర్తించాలి. బ్రిక్స్ విస్తరణకు భారత్ పూర్తి స్థాయి మద్దతిస్తోంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఎందుకీ విస్తరణ?
అమెరికా సారథ్యంలోని పాశ్చాత్య కూటమి జీ-7కు పోటీగా బ్రిక్స్ను తయారు చేయాలన్నది రష్యా, చైనాల ఉద్దేశంగా భావిస్తున్నారు. భారత్, చైనా, బ్రెజిల్లాంటి దూసుకెళుతున్న దేశాలుండటం దీని బలం. వీటికితోడు 23 దేశాలు బ్రిక్స్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకుకు పోటీగా ఈ కూటమి సొంతగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ను ఇప్పటికే ఆరంభించింది. ఇప్పటిదాకా వివిధ దేశాలకు 33 బిలియన్ డాలర్ల రుణాలు అందజేసింది. ఇప్పుడు మరిన్ని దేశాలు చేరుతుండటంతో ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయాల్లో బ్రిక్స్ ప్రాధాన్యం ఇంకా పెరుగుతుందనుకుంటున్నారు.
అధినేతలతో మోదీ భేటీ
- ప్రధాని మోదీ ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీతో సమావేశమయ్యారు. రక్షణ, వ్యవసాయ తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు.
- సెనెగల్ అధ్యక్షుడు మ్యాకీ సల్తోనూ మోదీ భేటీ అయ్యారు. ఇంధన, మౌలిక వసతులు, రక్షణ రంగాలపై చర్చించారు.
- బ్రిక్స్ డిన్నర్లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోదీ మాట్లాడారు. బుధవారం రాత్రి రమఫోసా ఈ డిన్నర్ ఏర్పాటు చేశారు.
- ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇంధనం, తీవ్రవాదం, అఫ్గానిస్థాన్ అంశాలపై వారు చర్చించారు.
- మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీతో మోదీ చర్చలు జరిపారు.
- ఆఫ్రికాకు నమ్మకమైన భాగస్వామి భారత్ అని మోదీ స్పష్టం చేశారు. బ్రిక్స్తోపాటు ఆఫ్రికా దేశాల అధినేతలతో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ