ఏ దేశమేగినా.. ‘అధినేతలు మనవాళ్లే!’
విశ్వగురుగా పేరొందిన భారతావని ప్రపంచ రాజకీయాల్లో సైతం తన ముద్ర వేస్తోంది. భారతీయ మూలాలున్న నేతలు అనేక దేశాల్లో కీలక పదవులను అధిరోహిస్తున్నారు.
సింగపూర్ అధ్యక్ష పీఠంపై షణ్ముగరత్నం
ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు
సింగపూర్: విశ్వగురుగా పేరొందిన భారతావని ప్రపంచ రాజకీయాల్లో సైతం తన ముద్ర వేస్తోంది. భారతీయ మూలాలున్న నేతలు అనేక దేశాల్లో కీలక పదవులను అధిరోహిస్తున్నారు. తాజాగా సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికైన థర్మన్ షణ్ముగరత్నం ఆ జాబితాలో చేరారు. 66 ఏళ్ల షణ్ముగరత్నంకు 70.4 శాతం ఓట్లతో సింగపూర్ ప్రజలు బ్రహ్మరథం పట్టడం విశేషం. 2020 నుంచి సింగపూర్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న ప్రీతమ్ సింగ్ కూడా భారతీయ మూలాలున్న న్యాయవాది, రచయిత కూడా! ఇప్పటికే భారత సంతతి నేతలు అమెరికా సహా అనేక దేశాల్లో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.... తాజాగా ఆ దేశ అధ్యక్ష పదవిపై కన్నేసి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న వివేక్ రామస్వామి కూడా భారతీయ మూలాలున్న వారే. వివేక్ తల్లిదండ్రులు కేరళ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనకు పోటీగా రంగంలో ఉన్న... నికీ హేలీ కూడా భారత సంతతికి చెందిన నేతే! అమెరికా పార్లమెంటులోనైతే చాలామంది మన వాళ్లున్నారు. రాజా కృష్ణమూర్తి, రోఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బెరా, తానేదార్లు ఇటీవలే మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్సీ) ఛైర్మన్ పదవికి కాలిఫోర్నియాకు చెందిన హర్మీత్ థిల్లాన్ పోటీ పడ్డారు.
ఆ దేశ ప్రధానులూ...
ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలిగి... మనల్ని ఏలిన బ్రిటన్కు ఇప్పుడు మన వాడైన రిషి సునాక్ ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే! బ్రిటన్ను పాలిస్తున్న తొలి భారత సంతతి రాజకీయ నాయకుడే కాకుండా... 210 సంవత్సరాల్లో అత్యంత పిన్నవయస్కుడైన ఇంగ్లాండ్ ప్రధానిగా కూడా సునాక్ చరిత్ర సృష్టించారు. ఆయన కేబినెట్లో మంత్రులుగా చేస్తున్న బ్రవర్మన్, క్లైరీ కౌటిన్హోలు కూడా గోవా మూలాలున్నవారే! బ్రిటన్కున్న ప్రాధాన్యం కారణంగా చాలా మందికి సునాక్ పేరు, ఆయన భారతీయ మూలాలు తెలిశాయి. కానీ ప్రపంచానికి పెద్దగా తెలియకుండా ప్రధానులుగా కొనసాగుతున్న మరో ఇద్దరు భారత సంతతివారున్నారు.
వారే... ఐర్లాండ్ ప్రధాని లియో ఎరిక్ వరాద్కర్! పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా! వరాద్కర్ తండ్రి ముంబయిలో జన్మించి డాక్టర్గా యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లారు. 2015 నుంచీ పోర్చుగల్ ప్రధానిగా కొనసాగుతున్న ఆంటోనియో కోస్టా భారత్, పోర్చుగీసు మూలాలున్న వ్యక్తి.
- కరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రెసిడెంట్ ఎలెక్ట్ క్రిస్టిన్ కార్లా కంగాలూ కూడా ఇండో-ట్రినిడాడ్ కుటుంబం నుంచి వచ్చారు.
- 2017 నుంచి మారిషస్ ప్రధానిగా ఉన్న ప్రవింద్ జగన్నాథ్ హిందూ యదువంశ కుటుంబానికి చెందినవారు. ఆయన తాత ముత్తాతలు 1870లో ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడికి వలస వెళ్లారు.
- సురినామ్ అధ్యక్షుడు చంద్రిక ప్రసాద్ సంతోఖి, గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ, సీషెల్స్ అధ్యక్షుడు వావెల్ రామకల్వాన్, మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్సింగ్ రూపన్లూ భారతీయ మూలాలున్నవారే!
- కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో మనవాళ్లు అనేక మంది మంత్రులుగా కొనసాగుతున్నారు.
- 2021లో తయారు చేసిన ఓ జాబితా ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో భారత సంతతి నేతలు 200 మందికిపైగా ఉన్నత పదవుల్లో ఉన్నారు. వీరిలో 60 మందికిపైగా కేబినెట్ మంత్రి పదవుల్లో ఉన్నట్లు తేల్చారు. భారత విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత సంతతి ప్రజల సంఖ్య సుమారు 3.2 కోట్లు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
స్లొవేకియా ప్రధాని రాబర్డ్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. -
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
హాలివుడ్ సినిమా తరహాలో ఓ గ్యాంగ్ సభ్యులు డ్రగ్లార్డ్ను విడిపించుకుపోయారు. జైలు వాహన కాన్వాయ్పై ఆటోమేటిక్ ఆయుధాలు, ఖరీదైన ఎస్యూవీతో దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి