కర్బన సుంకంపై పీటముడి
భారత్, చైనా సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై.. వాటి తయారీ ప్రక్రియలో వెలువడే కాలుష్యం స్థాయిని బట్టి కర్బన సుంకం విధించాలన్న ఐరోపా సంఘం (ఈయూ) ప్రణాళికలు దుబాయ్ వేదికగా జరుగుతున్న కాప్-28 సదస్సులో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
పలు ఉత్పత్తులపై కాలుష్య పన్ను విధింపునకు ఈయూ ప్రణాళికలు
భారత్ సహా పలు దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత
కాప్-28 సదస్సులో వాడీవేడిగా చర్చ
దుబాయ్: భారత్, చైనా సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై.. వాటి తయారీ ప్రక్రియలో వెలువడే కాలుష్యం స్థాయిని బట్టి కర్బన సుంకం విధించాలన్న ఐరోపా సంఘం (ఈయూ) ప్రణాళికలు దుబాయ్ వేదికగా జరుగుతున్న కాప్-28 సదస్సులో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అలాంటి పన్ను అమల్లోకి వస్తే- తమ ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని, ఆర్థిక వృద్ధి కుంటుపడుతుందని పేద దేశాలు వాదిస్తున్నాయి. సాధారణంగా ఇనుము, ఉక్కు, సిమెంటు, ఎరువులు, అల్యూమినియం వంటి ఉత్పత్తుల తయారీకి అధిక ఇంధనం అవసరం. తమ సంఘంలోని సభ్య దేశాల్లో పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా వీటిని ఉత్పత్తి చేస్తున్నామని.. ఇతర దేశాలు మాత్రం కాలుష్య స్థాయులను పట్టించుకోవడం లేదని ఈయూ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈయూయేతర దేశాల నుంచి అలాంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే.. వాటి తయారీ ప్రక్రియలో వెలువడే కాలుష్య ఉద్గారాల స్థాయిని బట్టి ‘కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (సీబీఏఎం)’ పేరుతో కర్బన సుంకం వసూలు చేయాలని కాప్-28 సదస్సు సందర్భంగా ఈయూ ప్రతిపాదించింది. అప్పుడే హరిత ప్రమాణాలను అనుసరిస్తున్న తమ దేశీయ పరిశ్రమలకు మేలు చేకూరుతుందని పేర్కొంది. 2030 కల్లా కర్బన ఉద్గారాలను 55% దాకా తగ్గించాలన్న తమ లక్ష్యాన్ని అందుకునేందుకు ఈ సుంకం అవసరమని స్పష్టం చేసింది.
పేద దేశాలకు 590 కోట్ల డాలర్ల నష్టం
భారత్ సహా ఇతర వర్ధమాన, పేద దేశాలు సీబీఏఎంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. ఆ సుంకం వల్ల ఈయూకు తమ ఉత్పత్తుల ఎగుమతి చాలా ప్రియంగా మారుతుందని అవి వాదిస్తున్నాయి. కర్బన సుంకం అమల్లోకి వస్తే.. దాని రూపంలో ధనిక దేశాలు ఏటా 250 కోట్ల డాలర్లు పొందే అవకాశముందని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి సదస్సు ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. అదే సమయంలో పేద దేశాలు 590 కోట్ల డాలర్లు కోల్పోయే ముప్పుందని నిర్ధారించింది. ప్రధానంగా ఆఫ్రికా దేశాలపై అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ముప్పుందని తెలిపింది. మరోవైపు- అమెరికా, కెనడా వంటి దేశాలూ ఇతర రూపాల్లో కర్బన సుంకం వసూలుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
కాప్-29 సదస్సు వేదిక బాకు
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘29వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్-29)’ సదస్సుకు అజర్బైజాన్ దేశ రాజధాని బాకు వేదికగా నిలవనుంది.
ముసాయిదా విడుదల
కాప్-28 సదస్సులో జరిపిన చర్చలపై ఆదివారం ముసాయిదా పత్రం విడుదలైంది. పారిశ్రామిక విప్లవం ముందునాటి కాలంతో పోలిస్తే ఈ శతాబ్దాంతానికి భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న లక్ష్యం నెరవేరే దిశగా ప్రస్తుతం అడుగులు పడటం లేదని దానిద్వారా స్పష్టమవుతోంది. కాలుష్య కట్టడికి అవసరమైన హరిత ప్రమాణాలను అమలు చేసేందుకు వర్ధమాన, పేద దేశాలకు ఏటా 21,500 కోట్ల డాలర్ల నుంచి 38,700 కోట్ల డాలర్ల వరకు అవసరమని ముసాయిదాలో పేర్కొన్నారు. కానీ కాలుష్య నివారణ కోసం వాటికి అందుతున్న నిధులు మాత్రం 2,100 కోట్ల డాలర్లకు మించడం లేదని వెల్లడించారు. మరోవైపు- కాప్-28లో చర్చలు ఆశించిన వేగంతో సాగడం లేదంటూ సదస్సు అధ్యక్షుడు సుల్తాన్ అల్-జబేర్ విచారం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
స్లొవేకియా ప్రధాని రాబర్డ్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. -
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
హాలివుడ్ సినిమా తరహాలో ఓ గ్యాంగ్ సభ్యులు డ్రగ్లార్డ్ను విడిపించుకుపోయారు. జైలు వాహన కాన్వాయ్పై ఆటోమేటిక్ ఆయుధాలు, ఖరీదైన ఎస్యూవీతో దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి