న్యూయార్క్‌లో భారత మహిళ ఆత్మహత్య..

కుమార్తెలకు జన్మనిచ్చావంటూ భర్త వేధింపులు.. అత్తింటివారి సూటిపోటి మాటలు భరించలేని ఓ ప్రవాస భారతీయురాలు తనువు చాలించింది. అంతకుముందే తన బాధలను వెళ్లగక్కుతూ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు

Published : 07 Aug 2022 05:42 IST

కుమార్తెలకు జన్మనిచ్చావంటూ భర్త వేధింపులు.. అత్తింటివారి సూటిపోటి మాటలు భరించలేని ఓ ప్రవాస భారతీయురాలు తనువు చాలించింది. అంతకుముందే తన బాధలను వెళ్లగక్కుతూ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన మన్‌దీప్‌ కౌర్‌(30)కు రన్‌జోద్‌బీర్‌ సింగ్‌ సంధుతో 2015లో వివాహం జరిగింది. వీరు అమెరికాలోని న్యూయార్క్‌కు వలస వెళ్లారు. వారికి 4, 2 ఏళ్ల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమార్తెలు పుట్టినప్పటినుంచి కౌర్‌కు వేధింపులు మొదలయ్యాయి. భర్త శారీరకంగా హింసించేవాడు. అత్తింటివారు సైతం మానసికంగా హింసించేవారు. ‘ఆత్మహత్య చేసుకొని చనిపొమ్మంటూ అత్తింటివారు వేధిస్తున్నారు’ అని కౌర్‌ ఆ వీడియోలో వాపోవడం ఆమె దీనస్థితికి అద్దం పడుతోంది. భర్త దాడులకు సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎనిమిదేళ్లుగా ఈ బాధలను అనుభవిస్తున్నానని, ఇకనైనా భర్త మారతాడేమోనని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఇన్ని బాధలను అనుభవిస్తూ ఇకపై బతికుండలేనని పేర్కొంటూ.. ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. యూపీలోని మృతురాలి తల్లిదండ్రులు ఈ విషయాన్ని వెల్లడించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని