Hamas: ‘బందీలకు మత్తుమందు ఇచ్చి.. కృత్రిమ నవ్వులు తెప్పించి!’
బందీలు సంతోషంగా, ప్రశాంతంగా కనిపించేలా హమాస్ మిలిటెంట్లు వారికి మత్తుమందు ఇచ్చారని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ పేర్కొంది.
జెరూసలెం: హమాస్ (Hamas) చెరలో ఉన్న బందీలు ఇటీవల విడుదలైన సందర్భంలో మిలిటెంట్లకు నవ్వుతూ వీడ్కోలు చెబుతున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఆ వీడియోలను చూస్తుంటే.. హమాస్ వారిని నిజంగా బాగా చూసుకుందా? అనే అభిప్రాయాలు రేకెత్తాయి. ఇదే విషయమై ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ (Israel Health Ministry) తాజాగా కీలక విషయం వెల్లడించింది. రెడ్క్రాస్కు అప్పగించే ముందు బందీలంతా ప్రశాంతంగా, సంతోషంగా కనిపించేలా వారికి హమాస్ మిలిటెంట్లు మత్తుమందు ఇచ్చారని ఆరోగ్య శాఖ ప్రతినిధి ‘ఇజ్రాయెల్ పార్లమెంట్ హెల్త్ కమిటీ’కి చెప్పారు. బందీలు 50 రోజులకుపైగా ఎదుర్కొన్న శారీరక వేధింపులు, మానసిక భయాందోళనలను కప్పిపుచ్చేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు.
హమాస్ సొరంగాలను నీటితో నింపేందుకు ఏర్పాట్లు..!
బందీలకు మత్తుమందులు ఇచ్చారనేదానికి బలం చేకూర్చే సాక్ష్యాలు, ఇతర వైద్య పరిశోధనల వివరాలతో కూడిన నివేదికను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలకు పంపాలని ‘ఆరోగ్య కమిటీ’ ఛైర్మన్.. సంబంధిత శాఖకు సూచించినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. అంతకుముందు.. బందీల తలపై హమాస్ మిలిటెంట్లు తుపాకీ గురిపెట్టి బలవంతంగా నవ్వుతూ, చేతులు ఊపేలా చేస్తున్నారంటూ ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి, సుమారు 240 మందిని గాజాకు బందీలుగా తీసుకెళ్లారు. ఇటీవల తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టారు. హమాస్ ఉగ్రవాదుల వద్ద ఇంకా 137 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా