Indonesia: 133 మందిని బలిగొన్న ఆ స్టేడియం కూల్చివేతకు నిర్ణయం!
క్రీడా చరిత్రలో ఇటీవల పెను విషాదానికి కేంద్రంగా నిలిచిన ఇండోనేషియాలోని ఫుట్బాల్ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. దేశ అధ్యక్షుడు జోకో విడోడో మంగళవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ స్టేడియాన్ని కూల్చివేసి, అన్ని భద్రతా ప్రమాణాలతో పునర్నిర్మిస్తామని వెల్లడించారు.
జకర్తా: క్రీడా చరిత్రలో ఇటీవల పెను విషాదానికి కేంద్రంగా నిలిచిన ఇండోనేషియా(Indonesia)లోని కంజురుహాన్ ఫుట్బాల్ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. దేశ అధ్యక్షుడు జోకో విడోడో మంగళవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ స్టేడియాన్ని కూల్చివేసి, అన్ని భద్రతా ప్రమాణాలతో పునర్నిర్మిస్తామని వెల్లడించారు. మరోవైపు.. దేశంలో ఫుట్బాల్((Football)ను సంస్కరించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని ఫిఫా(FIFA) అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన జకర్తాలో విడోడోతో భేటీ అయ్యారు. ఈ దేశంలో వచ్చే ఏడాది అండర్-20 ఫుట్బాల్ ప్రపంచ కప్ జరగనుంది.
అక్టోబర్ 1న తూర్పు జావా ప్రావిన్స్లోని కంజురుహాన్ ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 133 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రోజును.. ఫుట్బాల్ క్రీడా చరిత్రలో చీకటి రోజుల్లో ఒకటిగా ఇన్ఫాంటినో అభివర్ణించారు. ఫిఫా ప్రమాణాలతో నిర్మించనున్న కొత్త స్టేడియంలో క్రీడాకారులు, ప్రేక్షకుల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ‘ఇండోనేషియాలో ఫుట్బాల్ను సంస్కరిస్తాం. మ్యాచుల నిర్వహణ విషయంలో మార్పులు తీసుకొస్తాం’ అని ఇన్ఫాంటినో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వంతోపాటు ఆసియా ఫుట్బాల్ సమాఖ్య, ఇండోనేషియా ఫెడరేషన్తో కలిసి పని చేస్తామన్నారు.
స్టేడియాల నిర్వహణ, అభిమానుల ప్రవర్తనను మెరుగుపరచడం, పాఠశాలల్లో ఫుట్బాల్ సంబంధిత కార్యక్రమాలు రూపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మే- జూన్ మధ్యలో స్థానికంగా నిర్వహించే అండర్-20 ఫుట్బాల్ ప్రపంచకప్ సురక్షితంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇండోనేషియాలోనే ఉన్న ఫిఫా, ఆసియా ఫుట్బాల్ సమాఖ్య ప్రతినిధులు.. ఇటీవలి తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. విచారణ ప్రక్రియ పూర్తయ్యే వరకు దేశంలోని అన్ని ఫుట్బాల్ మ్యాచ్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు దేశాధ్యక్షుడు విడోడో ఇప్పటికే ప్రకటించారు. అన్ని స్టేడియాల భద్రతపై సమీక్షకు ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.