Electricity: నేపాల్ నుంచి.. భారత్కు విద్యుత్ ఎగుమతి
మిగులు విద్యుత్తు (electricity)ను భారత్లోని విద్యుత్తు ఎక్స్ఛేంజిలకు విక్రయించాలని నేపాల్ (Nepal) నిర్ణయించింది. శనివారం నుంచే జలవిద్యుత్ ఎగుమతులను ప్రారంభించింది.
కాఠ్మాండూ: హిమాలయ దేశం నేపాల్ (Nepal)లో జల విద్యుత్ (Hydroelectricity) ఉత్పత్తి పెరగడంతో ఈ ఏడాది కూడా మిగులు నమోదైంది. దీంతో పొరుగుదేశమైన భారత్ (India)కు ఆ మిగులు విద్యుత్ ఎగుమతులను ప్రారంభించింది. ఈ మేరకు నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అధికార ప్రతినిధి సురేశ్ భట్టరాయ్ వెల్లడించారు. శనివారం నుంచి భారత్కు 600 మెగావాట్ల విద్యుత్ విక్రయాలు మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.
నేపాల్లోని హైడ్రోపవర్ ప్రాజెక్టు (hydropower projects)ల్లో అత్యధిక శాతం.. నదులపై ఆధారపడినవే. సాధారణంగా ఈ దేశంలో శీతాకాలంలో విద్యుత్కు డిమాండ్ ఎక్కువగా ఉండగా.. ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. కానీ, వేసవి సమయంలో డిమాండ్ తగ్గడంతో పాటు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మిగులు విద్యుత్ నమోదవుతుంది. గతేడాది కూడా నేపాల్ ఇలాగే జూన్ నుంచి నవంబరు వరకు భారత్కు జలవిద్యుత్ను ఎగుమతి చేసింది. తద్వారా దాదాపు రూ.1200 కోట్లను ఆర్జించింది.
భారత్ పర్యటనకు నేపాల్ ప్రధాని..
ఇదిలా ఉండగా.. నేపాల్ ప్రధాని పుష్ప కుమార్ దహల్ (Pushpa Kamal Dahal) ‘ప్రచండ’ వచ్చే వారంలో భారత పర్యటనకు రానున్నారు. మే 31 (బుధవారం) నుంచి నాలుగు రోజుల పాటు ఆయన భారత్లో పర్యటించనున్నారు. గతేడాది డిసెంబరులో ప్రచండ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. ప్రధానితో పాటు ఆయన కుమార్తె గంగా దహల్ కూడా భారత్కు రానున్నారు. భారత ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దిల్లీకి రానున్నట్లు నేపాల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. పర్యటనలో భాగంగా ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. దిల్లీతో పాటు మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఉజ్జయినీలో ఆయన పర్యటించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు