USA: అమెరికాలో పిడుగుల అలజడి.. 2,600 విమానాల రద్దు..
అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు విమానసర్వీసులకు అంతరాయంగా మారాయి. వేల సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా(USA)లో పిడుగులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని కారణంగా దాదాపు 2,600 విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతోపాటు మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని ఈశ్యాన్య ప్రాంతంలో ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం ప్రకారం.. ఈశ్యాన్య ప్రాంతంలో 1,320 విమాన సర్వీసులు రద్దు కాగా.. వాటిల్లో 350 న్యూజెర్సీలోని న్యూఆర్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉన్నాయి. దీంతోపాటు జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్, లా గార్డియన్ ఎయిర్ పోర్టుల్లో పలు సర్వీసులు రద్దు చేశారు. జేఎఫ్కే విమానాశ్రయంలో 318 రద్దు కాగా.. 426 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక లా గార్డియన్లో 270 సర్వీసులు రద్దుకాగా.. 292 ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి.
చాలా విమానయాన సంస్థలు అడ్వైజరీలను ట్విటర్లో పోస్టు చేశాయి. ప్రయాణికులు ఎయిర్పోర్టుకు బయల్దేరే ముందు.. మరోసారి విమాన సమయాలను, వాతావరణ పరిస్థితులను చెక్ చేసుకోవాలని సూచించాయి. ఈశాన్య అమెరికా ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండటంతో పలు చోట్ల వరదలొస్తున్నాయి.
న్యూయార్క్, న్యూజెర్సీ, కనెటికట్, పెన్సిల్వేనియా, మాస్సాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. ఇక కనెటికట్, మస్సాచుసెట్స్, న్యూహాంప్షైర్, న్యూయార్క్, రోడే దీవిలో టోర్నడో వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.
మరోవైపు అమెరికాలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వార్తలొస్తున్నాయి. ఆదివారం కాలిఫోర్నియాలోని డెత్వ్యాలీలో ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశాల్లో డెత్వ్యాలీ కూడా ఒకటి. కాలిఫోర్నియా నుంచి టెక్సాస్దాకా శక్తిమంతమైన వేడి గాలులు వీస్తున్నాయని అమెరికా జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. సాధారణంకంటే 10 నుంచి 20 డిగ్రీల ఫారన్హీట్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఆరిజోనా రాష్ట్రంలో పగటి సమయం అధికంగా ఉంటోంది. రాజధాని ఫీనిక్స్లో వరుసగా 16 రోజులపాటు 109 డిగ్రీల ఫారన్హీట్ (43 డిగ్రీల సెల్సియస్) కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా