Yevgeny Prigozhin: ‘మేం లొంగిపోం.. త్వరలో రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారు’: ప్రిగోజిన్ వ్యాఖ్యలు
వాగ్నర్ గ్రూప్(wagner group) తిరుగుబాటుతో రష్యా అధినాయకత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కఠిన చర్యలు తప్పవని అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించినా.. ఆ గ్రూప్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
మాస్కో: వాగ్నర్ గ్రూప్(wagner mercenary group) తిరుగుబాటుతో ప్రస్తుతం రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్(yevgeny Prigozhin) రష్యా ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా మండిపడ్డారు. తమ విషయంలో పుతిన్ పొరబడ్డారని, తాము దేశభక్తులమని ప్రిగోజిన్ అన్నారు. అలాగే ఈ దేశానికి కొత్త అధ్యక్షుడు వస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘మేం ఎవరికీ ద్రోహం చేయలేదు. అధ్యక్షుడు పొరబడ్డారు. మేం దేశభక్తులం. ఏ ఒక్కరూ కూడా లొంగిపోవడం లేదు. ఎందుకంటే మేం ఈ దేశాన్ని అవినీతి, అబద్ధాలు, బ్యూరోక్రసీలో మగ్గిపోవాలని కోరుకోవడం లేదు. పుతిన్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారు’అని పుతిన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అలాగే వాగ్నర్ దళాలు రష్యా దక్షిణ ప్రాంత నగరాల నుంచి ముందుకు సాగుతున్నట్లు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మీడియాకు వెల్లడించారు. వారు ప్రయాణిస్తోన్న మోటార్ వే మాస్కో నగరాన్ని కలుపుతుంది.
పుతిన్కు మద్దతుగా చెచెన్యా నేత..
చెచెన్యా నేత, క్రూరుడిగా పేరున్న రంజాన్ కదిరోవ్ (Ramzan Kadyrov)ప్రస్తుత తిరుగుబాటుపై ప్రకటన విడుదల చేశారు. ప్రిగోజిన్(yevgeny Prigozhin) చర్యలను ఖండించిన ఆయన.. రష్యాకు మద్దతు తెలిపారు. తాజా ఉద్రిక్తతలను తొలగించేందుకు సహకరిస్తానని వెల్లడించారు. ప్రిగోజిన్ తీరును వెన్నుపోటు చర్యగా అభివర్ణించారు. మరోపక్క..రష్యా పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న పొలండ్.. దేశంలో అత్యంత అప్రమత్తతను ప్రకటించింది.
సొంత నగరంపైనే బాంబులు కురిపించిన రష్యా..
ఇన్నిరోజులు ఉక్రెయిన్లోని నగరాలపై బాంబుల వర్షం కురిపించిన రష్యా.. ఇప్పుడు సొంత నగరంపైనే దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాగ్నర్ సేనలను నిలువరించేందుకు.. వొరొనెజ్లోని ఆయిల్ రిఫైనరీ, డిపోపై బాంబు దాడి చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజా పరిణామాల నేపథ్యంలో పుతిన్కు రష్యా పార్లమెంట్ పూర్తి మద్దతు ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ