Grain Deal: పుతిన్- ఎర్డోగాన్ల భేటీ.. కొలిక్కిరాని ధాన్యం ఎగుమతుల వివాదం!
ధాన్యం ఎగుమతుల ఒప్పందంపై చర్చలకు సిద్ధమేనని రష్యా అధినేత పుతిన్ చెప్పారు. జులైలో ఈ ఒప్పందం నుంచి రష్యా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
మాస్కో: నల్ల సముద్రం (Black Sea) మీదుగా ఆహార ధాన్యాల ఎగుమతులకు ఉక్రెయిన్, రష్యాల మధ్య కుదిరిన ‘ధాన్యం ఎగుమతుల ఒప్పందం (Grain Deal)’ జులైలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఎగుమతుల విషయంలో తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు రష్యా పేర్కొంది. తాజాగా రష్యాలోని సోచి వేదికగా.. దేశాధినేత పుతిన్ (Putin), తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ల మధ్య జరిగిన భేటీ సందర్భంగా ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. అయితే, ఈ వివాదం కొలిక్కి రాలేదు.
త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని సమావేశం అనంతరం ఎర్డోగాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం విషయంలో రష్యాపై ఉక్రెయిన్ తన కఠిన వైఖరిని కాస్త వీడాలని కోరారు. అంతకుముందు ‘ధాన్యం ఒప్పందం’పై రష్యా వైఖరిని పునరుద్ఘాటించిన పుతిన్.. ఈ అంశంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ డిమాండ్లు నెరవేరిన తర్వాత ఒప్పందంలో తిరిగి వచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. నల్ల సముద్రం కారిడార్లను సైనిక ప్రయోజనాలకు ఉపయోగించరాదని పేర్కొన్నారు.
ధాన్యం ఎగుమతుల ఒప్పందం.. రష్యా మరోసారి పేచీ!
గతేడాది ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య మొదలు.. ఈ రెండు దేశాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. సమస్యకు పరిష్కారంగా గతేడాది జులైలో.. తుర్కియే, ఐరాస సమక్షంలో ఈ రెండు దేశాల మధ్య ‘ధాన్యం ఎగుమతుల ఒప్పందం’ కుదిరింది. అయితే.. గతేడాది నవంబరులో ఒకసారి, ఈ ఏడాది జులైలో మరోసారి రష్యా ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. ఉక్రెయిన్లో ధాన్యం రవాణాకు కీలకమైన ఒడెస్సా పోర్టులోని కీలక సదుపాయాలను ఇటీవల ధ్వంసం చేసింది. ఈ పరిణామాల నడుమ పుతిన్- ఎర్డోగాన్ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ