Pak Army: పాక్ ఆర్మీకి గట్టి దెబ్బ! బీఎల్ఏ దాడుల్లో వందకుపైగా సైనికుల మృతి?
పాకిస్థాన్ సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది! ఇక్కడి బలోచిస్థాన్ ప్రావిన్స్లోని రెండు వేర్వేరు సైనిక శిబిరాలపై ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’ వేర్పాటువాదులు బుధవారం అర్ధరాత్రి భారీ ఎత్తున ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ క్రమంలో దాదాపు వందకుపైగా...
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది! ఇక్కడి బలోచిస్థాన్ ప్రావిన్స్లోని రెండు వేర్వేరు సైనిక శిబిరాలపై ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’ వేర్పాటువాదులు బుధవారం అర్ధరాత్రి భారీ ఎత్తున ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ క్రమంలో దాదాపు వందకుపైగా సైనికులను హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటించింది. అయితే, పాక్ ఆర్మీ మాత్రం.. దాడులను తిప్పికొట్టినట్లు తెలిపింది. ఒక సైనికుడు మృతి చెందినట్లు, తిరుగుబాటుదారుల్లో నలుగురిని మట్టుబెట్టినట్లు వెల్లడించింది. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బీజింగ్కు బయలుదేరడానికి కొన్ని గంటల ముందు ఈ దాడులు జరగడం గమనార్హం. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోన్న విషయం తెలిసిందే.
పంజ్గుర్, నౌష్కీ జిల్లాల్లోని సైనిక స్థావరాలపై జరిగిన ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసిన బీఎల్ఏ.. తమ ఆత్మాహుతి బాంబర్లు సైనిక స్థావరాల ప్రవేశద్వారం వద్ద పేలుడు పదార్థాలతో నింపిన వాహనాలను పేల్చినట్లు ప్రకటించింది. ఈ శిబిరాలు ప్రస్తుతం తమ ఆధీనంలోనే ఉన్నట్లు చెప్పింది. మరోవైపు ఈ ఘటనపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. ఉగ్రదాడులను సమర్థంగా తిప్పికొట్టిన భద్రతా బలగాలకు సెల్యూట్ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం సైతం.. బీఎల్ఏ సభ్యులు గ్వాదర్ ఓడరేవు సమీపంలోని ఆర్మీ పోస్ట్పై దాడి చేసి 10 మంది సైనికులను హతమార్చారు.
బలోచిస్థాన్లోని గ్యాస్, ఖనిజ వనరులను దోపిడీ చేస్తోందని, ఈ నేపథ్యంలో తమకు స్వాతంత్ర్యం కావాలంటూ ఇక్కడి బీఎల్ఏ వేర్పాటువాదులు దశాబ్దాలుగా పాక్ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా చేపడుతున్న ప్రాజెక్టులు, సైనిక బలగాలపై దాడులకు దిగుతున్నారు. ఇదిలా ఉండగా.. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా ఇక్కడి గ్వాదర్ పోర్ట్, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న విషయం తెలిసిందే. మరోవైపు బలోచ్ తిరుగుబాటుదారులకు భారత్ రహస్యంగా మద్దతు ఇస్తోందని పాక్ పలు సందర్భాల్లో ఆరోపించింది. కానీ, భారత్ దీన్ని ఖండిస్తూ వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!