H-1B visas: హెచ్-1బీ వీసాల్లో మోసాలకు చెక్.. ఎంపిక ప్రక్రియలో కొత్త రూల్స్
H-1B visas: హెచ్-1బీ వీసాల ఎంపిక ప్రక్రియ కోసం అమెరికా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు లబ్ధిదారుల కేంద్రీకృత ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాల (H-1B visa) రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా (USA) కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి జారీ చేసే వీసాల ఎంపిక ప్రక్రియకు కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇకపై, ఒక లబ్ధిదారు బహుళ దరఖాస్తులు చేసుకున్నా.. ఒకే అప్లికేషన్గా పరిగణించనున్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా.. దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం ఈ ‘కేంద్రీకృత-ఎంపిక ప్రక్రియ’ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) వెల్లడించింది.
2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మొదలయ్యే వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ నిబంధనలను అమలు చేయనున్నారు. అంతేగాక, ప్రతి లబ్ధిదారు సరైన పాస్పోర్టు వివరాలు, ప్రయాణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. తప్పుడు సమాచారం ఇస్తే ఆ పిటిషన్లను తిరస్కరించే లేదా రద్దు చేసే అధికారం యూఎస్సీఐఎస్కు ఉంటుంది. పాస్పోర్టు, ఇతర గుర్తింపు వివరాల ఆధారంగా దరఖాస్తుదారుడి రిజిస్ట్రేషన్ను పరిగణనలోకి తీసుకుంటారు.
అమెరికాలోనే హెచ్-1బీ వీసాల రెన్యువల్ ప్రారంభం
హెచ్-1బీ వీసాల కోసం మొదటి రిజిస్ట్రేషన్ పీరియడ్ మార్చి 6 నుంచి మార్చి 22 వరకు కొనసాగనుంది. ఈ వ్యవధిలో పిటిషనర్లు, సంస్థలు.. రిజిస్ట్రేషన్, దరఖాస్తు రుసుము చెల్లింపుల కోసం తప్పనిసరిగా USCIS ఆన్లైన్ అకౌంట్ను వినియోగించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 నుంచి కంపెనీలు తమ అకౌంట్లను తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఫామ్ ఐ-129, నాన్-క్యాప్ హెచ్-1బీ పిటిషన్ల కోసం ఫామ్ ఐ-907 పత్రాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందని USCIS వెల్లడించింది.
వృత్తి నిపుణులకు ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో హెచ్-1బీ వీసాలు జారీ చేస్తారు. ఇందుకోసం ఏటా కొత్తగా దాదాపు 65 వేల వీసాలతోపాటు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ కోసం మరో 20వేల వీసాలను కేటాయిస్తారు. నాన్ ఇమిగ్రేషన్ (అమెరికాలో కొంతకాలం ఉండేందుకు) కింద ఇచ్చే హెచ్-1బీ వీసాలు పొందే వారిలో ఎక్కువగా భారతీయులే ఉంటారు. కంప్యూటరైజ్డ్ లాటరీ విధానంతో వీటిని జారీ చేస్తుంటారు.
అయితే, గత కొంతకాలంగా ఈ విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది ఈ వీసాల కోసం ఏకంగా 7.80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఒకే లబ్ధిదారుని తరఫున బహుళ రిజిస్ట్రేషన్లు సమర్పించి కొన్ని సంస్థలు లాటరీ విధానంలో అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో వీటిని అరికట్టేందుకు తాజా నిబంధనలను తీసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు