US ban: షింజియాంగ్ వస్తువులపై నేటి నుంచి అమెరికా నిషేధం..!
షింజియాంగ్ ప్రావిన్స్లోని వీఘర్ ముస్లింలపై చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అడ్డుకొనేందుకు అమెరికా చేపట్టిన చర్యలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిలో భాగంగా షింజియాంగ్ ప్రావిన్స్
ఇంటర్నెట్డెస్క్: షింజియాంగ్ ప్రావిన్స్లోని వీఘర్ ముస్లింలపై చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం చేస్తోన్నఅరాచకాలను అడ్డుకొనేందుకు అమెరికా చేపట్టిన చర్యలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిలో భాగంగా షింజియాంగ్ ప్రావిన్స్ నుంచి వచ్చే దిగుమతులపై అమెరికాలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం.. ఈ ప్రాంతం నుంచి ఎగుమతి చేసే వస్తువులు వీఘర్ల వెట్టిచాకిరితో తయారు చేయించినవి కావని కంపెనీలు నిరూపించుకోవాలి. షింజియాంగ్లో వీఘర్ ముస్లింలను బంధించి వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఇప్పటి వరకు అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. ఇప్పటికే అమెరికా ఈ ప్రాంతం నుంచి వచ్చే పత్తి, టమాటాలను నిషేధించింది. తాజాగా ఆ ఆంక్షలను అన్ని రకాల వస్తువులకు విస్తరించింది. దీంతో వీటిని నేటి నుంచి ‘ది వీఘర్ ఫోర్సుడ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్’ కిందకు తీసుకొచ్చారు.
గత వారం దీనిపై అమెరికా చట్టసభ సభ్యులు మాట్లాడుతూ ‘‘చైనా కమ్యూనిస్టు పార్టీ బలవంతపు వెట్టి చాకిరి చేయించడాన్ని, మానవీయతపై దాడి చేయడాన్ని చూస్తూ ఊరుకోమని ఈ చట్టం స్పష్టమైన సందేశం పంపిస్తుంది’’ అని పేర్కొన్నారు. మరోపక్క రిపబ్లికన్ల నుంచి కూడా ఈ నిర్ణయానికి మద్దతు లభించింది. ‘‘బైడెన్ కార్యవర్గం కలిసి ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది’’ అని అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనెటర్ మార్కో రూబియో పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ లెక్కల ప్రకారం చైనా 2017 నుంచి దాదాపు 10 లక్షల మంది వీఘర్లను బంధించింది. వీరిలో వేల మంది అతి తక్కువ వేతనంతో షింజియాంగ్లోని పలు కర్మాగారాల్లో పనిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.