Ukraine Crisis: క్షిపణులు ఎగురుతున్న చోట చర్చలా?

బెలారస్‌లోని గోమెల్‌ నగరంలో శాంతి చర్చలకు సిద్ధమంటూ రష్యా చేసిన ఆఫర్‌ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు....

Published : 27 Feb 2022 14:21 IST

బెలారస్‌లో శాంతి చర్చలకు తిరస్కరించిన జెలెన్‌స్కీ

దిల్లీ: బెలారస్‌లోని గోమెల్‌ నగరంలో శాంతి చర్చలకు సిద్ధమంటూ రష్యా చేసిన ఆఫర్‌ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. బెలారస్‌లోని పలు ప్రాంతాల నుంచీ రష్యా దాడులు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తమపై విరుచుకుపడని దేశాల్లో మాత్రమే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. పోలండ్‌ రాజధాని వార్సా, టర్కీలోని ఇస్తాంబుల్‌, అజర్‌బైజాన్‌ రాజధాని బకూ వంటి ప్రాంతాలు చర్చలకు అనువైనవిగా ఆయన పేర్కొన్నారు.

మరోవైపు గత రాత్రి ఉక్రెయిన్‌లో రష్యా సేనల దాడులు అత్యంత క్రూరంగా కొనసాగాయని జెలెన్‌స్కీ తెలిపారు. సామాన్య పౌరులు నివసిస్తున్న ప్రాంతాలను సైతం లక్ష్యంగా చేసుకున్నారన్నారు. చివరకు అంబులెన్సులపైనా దాడి చేస్తున్నారని ఆరోపించారు.

ఉక్రెయిన్‌కు విదేశీ మాజీ సైనికుల సాయం?

మరోవైపు సైన్యంలో పనిచేసిన అనుభం ఉన్న ఐరోపావాసులెవరైనా సరే ఉక్రెయిన్‌ చేస్తున్న పోరాటంలో చేరాలని జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. ఐరోపాను కాపాడుకోవడానికి ఇది చాలా అవసరమంటూ వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. దీంతో ఎస్టోనియా, లాత్వియా, జార్జియా, పోలండ్‌ వంటి దేశాల నుంచి పలువురు మాజీ సైనికులు ఉక్రెయిన్‌కు వస్తున్నట్లు అక్కడి స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని