icon icon icon
icon icon icon

Chandrababu: ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌.. ప్రజల మెడకు ఉరితాడు: చంద్రబాబు

సూపర్‌ సిక్స్‌, మోదీ హమీలు చూసి జగన్‌కు నిద్రపట్టడం లేదని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు.

Published : 05 May 2024 19:24 IST

తంబళ్లపల్లి: సూపర్‌ సిక్స్‌, మోదీ హమీలు చూసి జగన్‌కు నిద్రపట్టడం లేదని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పథకమూ ఆగదని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రజల మెడకు ఉరితాడు లాంటిదన్నారు.

వైకాపానేతల భూములను కూడా జగన్‌ వదలరని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంచినీళ్లు రాలేదని అడిగినందుకు గర్భిణిపై .. తంబళ్లపల్లి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకానాథ్‌రెడ్డి సతీమణి సాక్షిగా వైకాపా నాయకులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాపాల పెద్దిరెడ్డికి టైమ్‌ దగ్గరపడిందని హెచ్చరించారు. పెద్దిరెడ్డిది ఎర్రచందనం, మైనింగ్‌, ఇసుక మాఫియా అని ఆరోపించారు. రాజంపేట కూటమి ఎంపీ అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్ల వైకాపా పాలనలో దోపిడీతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఇలాంటి నేతలు మనకు అవసరమా?అని ప్రశ్నించారు. చంద్రబాబు, తాను కలిసి చిత్తూరు జిల్లాకు ఎంతో మేలు చేశామని గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img