Vidadala Rajini: మంత్రి విడదల రజని కాన్వాయ్కు ప్రమాదం..
ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువుకట్ట సమీపంలో మంత్రి విడదల రజని కాన్వాయ్లోని ఓ వాహనం ప్రమాదానికి గురైంది. మార్కాపురంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంత్రులు విడదల రజని, ఆదిమూలపు సురేశ్, మాజీ మంత్రి బాలినేని హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకొని కొనకనమిట్ల మండలానికి వెళ్తుండగా.. కాన్వాయ్లో ముందు వెళ్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. అయితే, ప్రమాదానికి గురైన వాహనంలో మంత్రి రజని లేకపోవడంతో ముప్పు తప్పింది.
Published : 09 Oct 2022 15:09 IST