Amaravati: అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ మందడంలో రైతులు ఆందోళన
రాజధాని (Amaravati) ప్రాంతంలో అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ మందడంలో రైతులు ఆందోళనకు దిగారు. తమ స్థలాల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. జోరు వానలోనూ రైతులు నిరసన కొనసాగించారు. సోమవారం అర్ధరాత్రి రాజధానిలోని ఓ ప్రజాప్రతినిధికి చెందిన అనుచరులు మందడంలో మట్టి తవ్వుతుంటే రైతులు అడ్డుకున్నారు. ఆ ప్రజాప్రతినిధి అనుచరులు తమపై దాడికి యత్నించారంటూ మంగళవారం ఉదయం రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం చర్యలు తీసుకునేంతవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్పారు.
Published : 30 May 2023 11:48 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి