Andhra News: మరి కాసేపట్లో పెళ్లి.. వరుడి ప్రియురాలు రాకతో ట్విస్ట్!
అనంతపురం జిల్లా గుత్తి మండలం ఇసురాళ్లపల్లిలో మరికాసేపట్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన యువతిని ప్రేమించాడు. అయితే పెద్దవడుగూరు మండలానికి చెందిన మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు ఆళ్లగడ్డ నుంచి గుత్తికి వచ్చి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రమేష్ను స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేసిన పోలీసులు.. పెళ్లిని ఆపేశారు.
Published : 17 Aug 2022 13:50 IST
Tags :