Humanity: గాయపడిన వ్యక్తిని కాపాడిన మంత్రి ఎర్రబెల్లి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మానవత్వాన్ని చాటారు. మునుగోడు పర్యటన నుంచి మంత్రి హనుమకొండకు వెళ్తుండగా.. పంథిని సమీపంలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురై కనిపించారు. దీంతో వెంటనే తన కాన్వాయ్ను ఆపిన మంత్రి.. సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం తన సిబ్బందితో గాయపడిన వ్యక్తిని ఎంజీఎమ్కు తరలించారు. కాగా, గాయపడిన వ్యక్తిని పంథినికి చెందిన రమేశ్గా గుర్తించారు.
Updated : 30 Oct 2022 21:58 IST
Tags :