Revanth Reddy: ఎన్నికల తర్వాత కారు, కమలం కలిసిపోతాయి: సీఎం రేవంత్‌

భారాస కారు దిల్లీకి పోతే కమలం పువ్వులా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.

Published : 04 May 2024 10:24 IST

భారాస కారు దిల్లీకి పోతే కమలం పువ్వులా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ధర్మపురి, సిరిసిల్ల సభల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. భాజపా-భారాస లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వానికి సలహాలివ్వాల్సిన మాజీ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్  సర్కార్  దిగిపోవాలని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. కవిత బెయిల్ కోసం దిల్లీ సుల్తానులకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇవాళ కొత్తగూడెం, వనపర్తి జిల్లాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు.    

Tags :

మరిన్ని