ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌.. ఇతర రాష్ట్రాలకు లేని తొందర జగన్‌కు ఎందుకు?: రామకృష్ణ

ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమల్లోకి వస్తే.. రైతుల భూములకు భరోసా ఉండదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం ఈ యాక్ట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Published : 04 May 2024 12:29 IST

రాజకీయ లబ్ధికోసమే వైకాపా ప్రభుత్వం పింఛనుదారులను ఇబ్బందిపెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) విమర్శించారు. అనంతపురంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పింఛన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎందుకు వినియోగించుకోవట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమల్లోకి వస్తే.. రైతుల భూములకు భరోసా ఉండదన్నారు. ప్రభుత్వం ఈ యాక్ట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

Tags :

మరిన్ని