
గ్రేటర్ హైదరాబాద్
తిరుమల రెండో కనుమ మార్గంలో ధ్వంసమైన రోడ్డు
తిరుమల, న్యూస్టుడే: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమ దారిలో బుధవారం ఉదయం బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. కొండపైకి వెళ్లే మార్గంలో 13, 14, 15 కిలోమీటర్ల పరిధిలో భారీగా దుమ్ము, పొగ లేవడాన్ని గుర్తించిన డ్రైవర్ రవీంద్ర.. వెంటనే బస్సు ఆపి మెల్లిగా వెనక్కి నడిపించారు. అంతలోనే కొండచరియలు విరిగిపడుతూ బండరాళ్లు, మట్టి రోడ్డుపైకి జారాయి. బస్సు ముందుకువెళ్లి ఉంటే.. భారీ ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు, ప్రయాణికులు ఆందోళన చెందారు. రోడ్డు ధ్వంసం కావడంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.