
‘అప్పు’డే అర లక్ష కోట్లు!
తాజాగా మరో రూ. 2,000 కోట్లు సేకరించిన ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరంలోనూ పరిమితిని మించి అప్పులు చేస్తోంది. ఒకవైపు మూడో తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేదు. అప్పు తెస్తే కానీ వారికి జీతాలివ్వలేని పరిస్థితి. రిజర్వు బ్యాంకు సోమవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్రం రూ. 2,000 కోట్ల రుణం తీసుకుంది. 13 ఏళ్ల కాలపరిమితిలో తీర్చేలా రూ. 1,000 కోట్లు 7.82 శాతం వడ్డీకి తీసుకుంది. మరో రూ. 1,000 కోట్లు 20 ఏళ్ల కాల పరిమితితో తీర్చేలా 7.74 శాతం
వడ్డీకి సమీకరించింది.
ఒక్క బహిరంగ మార్కెట్లోనే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ. 39,890 కోట్లు రుణం తీసుకున్నట్లయింది. బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి రూ. 8,300 కోట్లు, కేంద్ర రుణాలు రూ. 1,400 కోట్లు, నాబార్డు కొంత తీసుకుంది. కేంద్ర ఆర్థికశాఖ తొలి 9 నెలల కాలంలో మొత్తం రూ. 43,803 కోట్ల మేర బహిరంగ మార్కెట్ రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకుంటున్న రుణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే పరిగణిస్తామని, ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి చేర్చి లెక్కిస్తామని కేంద్రం పేర్కొంటోంది. ఈ రూపేణా చూస్తే రాష్ట్రం మొత్తం అప్పు ఇప్పటికే దాదాపు రూ. 50 వేల కోట్లకు చేరుకుంది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!