బ్రేకింగ్
19 Apr 2024 | 18:18 IST
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: రేవంత్
మహబూబాబాద్: ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం చాలా అవసరమన్నారు. మహబూబాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ ప్రసంగించారు. ‘‘తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ ఎన్నోసార్లు అవమానించారు. రాష్ట్ర ఏర్పాటు చెల్లదని పార్లమెంట్ సాక్షిగా అన్నారు. రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన భాజపాకి ఎందుకు ఓటు వేయాలి? కుమార్తె కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ చేతులు కలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్లదగ్గర తాకట్టు పెట్టారు’’ అని రేవంత్ విమర్శించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
- చివరి బంతికి వికెట్.. హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ
- లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
- ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
- డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
- బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
- రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
- 4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!