బ్రేకింగ్

breaking
01 May 2024 | 14:24 IST

మోదీ, అమిత్‌షా నాపై పగబట్టారు: సీఎం రేవంత్‌

కోరుట్ల: లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి దేశాన్ని అమ్మేయాలని భాజపా చూస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘రిజర్వేషన్ల రద్దుపై నేను ప్రశ్నించాను. దీంతో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నాపై పగబట్టి దిల్లీలో కేసు పెట్టారు. ఈడీ, ఐటీ, సీబీఐతోనే కాదు.. దిల్లీ పోలీసులతోనూ భయపెట్టాలని చూస్తున్నారు. కేసులకు రేవంత్‌రెడ్డి భయపడడు. మీ దగ్గర సీబీఐ ఈడీ, పోలీసులు ఉండొచ్చు. నావెంట 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని