
చెన్నై: రజనీకాంత్ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం ‘చంద్రముఖి’. రజనీ స్టైల్కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ‘వారాయ్’ పాట విశేష ప్రేక్షకాదరణ పొందింది. స్కూళ్లు, కాలేజీలు, టెలివిజన్ షోలు ఎక్కడ చూసినా ఆ పాటకు డ్యాన్స్ వేయకుండా ముగిసేది కాదంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘చంద్రముఖి2’ సెట్స్పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీన్ని ప్రకటించారు.
కాగా, తొలి చిత్రంలో గంగ/చంద్రముఖిగా రెండు భిన్న పాత్రలో నటించిన జ్యోతికను ‘చంద్రముఖి2’ గురించి ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సీక్వెల్ కోసం తనని ఎవరూ సంప్రదించలేదన్నారు. అసలు ఆ ప్రాజెక్టు గురించే తనకు తెలియదని చెప్పుకొచ్చారు.
జ్యోతిక కీలక పాత్రలో జె.జె. ఫెడ్రిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్మగళ్ వందాళ్’ చిత్రం మే 29 అమెజాన్ వేదికగా విడుదల చేయనున్నారు. లాక్డౌన్ కారణంగా నిర్మాత సూర్య ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఓటీటీ వేదికగా విడుదలవుతున్న తొలి తమిళ చిత్రంగా ‘పొన్మగళ్ వందాళ్’ రికార్డు సృష్టించింది.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి
- వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
- 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు
- నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
- యూఎస్లో ‘కొత్త ఆశలకు రెక్కలు’!
- బెయిర్స్టో విషయంలో పునరాలోచించాలి
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- అది నా గొప్పతనం కాదు: ద్రవిడ్
- ఆ బాధేంటో నాకు తెలుసు: రహానె
- అరవింద్స్వామి దొంగావతారం.. రెహమాన్ ఫన్నీ పోస్ట్