
తాజా వార్తలు
హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
కుమారుడిపై టర్పంటాయిల్ పోసి నిప్పంటించిన తండ్రి
ఆల్విన్ కాలనీ (హైదరాబాద్): నగరంలోని కేపీహెచ్బీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. కుమారుడికి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూల్కు చెందిన బాలు అనే వ్యక్తి కేపీహెచ్బీ కాలనీలోని ఓ పాఠశాల ఆవరణలో గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నాడు. అతడి భార్య అదే పాఠశాలలో అటెండర్గా పనిచేస్తోంది. వీరి చిన్న కుమారుడు చరణ్ (12) ఆ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
ఆన్లైన్ క్లాసులకు హాజరుకాకపోవడంతోపాటు సరిగా చదవడం లేదంటూ కుమారుడిపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేసి దాడి చేశాడు. దీన్ని తల్లి అడ్డుకోవడంతో కోపోద్రిక్తుడైన తండ్రి.. కుమారుడిపై పెయింటింగ్లకు ఉపయోగించే టర్పంటాయిల్ పోసి నిప్పంటించాడు. మంటలకు తట్టుకోలేక బాలుడు ఇంటి నుంచి బయటకి పరుగులు తీశాడు. ఈ క్రమంలో సమీపంలోని గోతిలో పడ్డాడు. స్థానికులు గుర్తించి ఆ బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తండ్రి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి..
మరోసారి అఖిలప్రియ బెయిల్ పిటిషన్
బైక్ అంబులెన్స్ రూపొందించిన డీఆర్డీవో