
తాజా వార్తలు
రాష్ట్రపతి టూర్లో కలెక్టర్కు చేదు అనుభవం
తిరుమల: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుమల పర్యటనలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. లోనికి అనుమతి లేదంటూ మహాద్వారం వద్ద తితిదే విజిలెన్స్ సిబ్బంది అడ్డుకోవడం కలకలం రేపింది. మహాద్వారం వద్ద రాష్ట్రపతి లోనికి వెళ్తుండగా జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఎస్పీ విజయారావు, సీఎంవో అధికారి ఆలస్యంగా అక్కడికి వచ్చారు. వారు లోపలికి వెళ్లకుండా తితిదే విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు ముందుకు వెళ్లలేక కాసేపు అక్కడే ఉండిపోయారు. ఫోన్లో ఇతర అధికారులను సంప్రదించిన కలెక్టర్ సమస్యను వివరించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న తిరుపతి అదనపు ఎస్పీ సుప్రజ.. వారిని దగ్గరుండి లోపలికి తీసుకెళ్లారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- అమిత్ షాతో కీలక అంశాలు చర్చించిన జగన్
- వీరే ‘గబ్బా’ర్ సింగ్లు..!
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- ‘కేరింత’ హీరోపై కేసు నమోదు
- రహానె వ్యూహం.. కుర్రాళ్ల పోరాటం... అద్భుతం
- కరోనా భయంతో.. అలా చేశాడట..!
- మాటల్లో చెప్పలేను: రహానె
- ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది
ఎక్కువ మంది చదివినవి (Most Read)
