
తాజా వార్తలు
పార్టీలకు సెల్లు కాదు..టాలెంటే ముఖ్యం
కేంద్రమంత్రి , భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ
నాగ్పూర్: రాజకీయ పార్టీలు కులాలు, మతాలు, వర్గాల ఆధారంగా విభాగాలు(సెల్) ఏర్పాటుకు తాను అనుకూలం కాదని కేంద్రమంత్రి , భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ అన్నారు. వీటికన్నా ప్రతిభ ముఖ్యమని తెలిపారు. తూర్పు విదర్భలోని భాజపా పట్టభద్రుల అభ్యర్థి సందీప్ జోషీకి మద్దతుగా ఆయన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. మనిషి కులం వల్ల గొప్పవాడు కాలేడని, ప్రతిభ వల్లే అవుతాడనేది తన అభిప్రాయమన్నారు. భాజపాలోనూ వేర్వేరు సెల్లు ఉన్నాయని.. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ అనుభవం ఎదురైందన్నారు.
కులాలు, మతాలు, వర్గాల ఆధారంగా ఎలాంటి విభాగాలు ఏర్పరచకూడదనేది తన అభిప్రాయమని, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. పార్టీ, కార్యకర్తలే తమ కుటుంబమన్నారు. ఎప్పుడూ కులాలు, వర్గాల ప్రాతిపదికన రాజకీయం చేయలేదని చెప్పారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అండగా ఉంటాం.. వాళ్లను కుటుంబ సభ్యులుగా పరిగణిస్తాం.. ఇదే భాజపా ప్రత్యేకత అని చెప్పారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
