
తాజా వార్తలు
మాస్క్ మనుషులు.. ఫోక్ డ్యాన్సులు
సోషల్ లుక్: సినీ తారల విశేషాలు మీకోసం..
ఇంటర్నెట్ డెస్క్: సినీ ఇండస్ట్రీకి కరోనా ఎంతో నష్టాన్ని మిగిల్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. ఎన్నడూ లేని విధంగా ఈసారి సినీ ప్రముఖులంతా తమతమ కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ ఫొటోలను తమ అభిమానులతో పంచుకున్నారు. అభిమానులు సైతం ఆ తమ అభిమాన నటుల ఫొటోలను చూస్తూ మురిసిపోతున్నారు. వాటిలో కొన్ని మీకోసం..
* కుటుంబంతో కలిసి విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు. మహేశ్బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అందులో నమ్రత, మహేశ్బాబుతో పాటు ఉన్న మరో ఇద్దరు మాస్కులు పెట్టుకొని ఉన్నారు. మాస్క్ గ్యాంగ్ అంటూ నమత్ర ఈ పోస్టు చేశారు.
* బాలీవుడ్ హీరోయిన్ కంగాన రనౌత్ తన సోదరుడి వివాహ కార్యక్రమంలో భాగంగా ఆడి పాడింది. ఈ సందర్భంగా తనకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టమని చెబుతూ ఆ వీడియోను తన ఇన్స్టాలో అభిమానులతో పంచుకుంది.
* దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్చరణ్తో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. వెనకాల తారాజువ్వలు వెలుగుతుండగా.. చిరు, చరణ్ ఇద్దరూ సెల్ఫీకి ఫోజులిస్తూ కనిపించారు.
* వింత ఆశ్చర్యంతోనే మొదలవుతుందని సోక్రటీస్ చెప్పారని సినీ నటి రాధికశరత్కుమార్ అన్నారు. చిన్నారితో కలిసి ఉన్న ఫొటోను ఆమె ట్విటర్లో పంచుకున్నారు. అచ్చం అలాంటి ఓ ఫొటోను రామ్చరణ్ కూడా అభిమానులతో పంచుకున్నారు.
* నటి టబు.. ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్టు చేశారు.
* రమ్యకృష్ణతో కలిసి ఉన్న ఫొటోను హీరోయిన్ విమలారామన్ ఇన్స్టాలో పోస్టు చేసింది. అందులో ఇద్దరూ చీరకట్టులో అందంగా ఉన్నారు.
* ఈ సోదరునితో వంట చేయడం సరదాగా ఉంటుంది అని బుల్లితెర నటి, యాంకర్ భానుశ్రీ ఓ వీడియో పోస్టు చేసింది. అందులో రోల్రైడా వంట చేస్తూ కనిపించాడు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- సికింద్రాబాద్లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
