
తాజా వార్తలు
అరుణాచలంలో వేడుకగా కార్తిక దీపోత్సవం
చెన్నై: తమిళనాడులో పరమశివుడు అరుణ వర్ణ స్వరూపుడై కొలువుదీరిన అరుణాచల క్షేత్రంలో కార్తిక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఏటా కృత్తికా నక్షత్రయుక్త పౌర్ణమి నాడు అరుణగిరిపై పరమశివుడు అఖండ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో ఆదివారం కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుణ్యక్షేత్రంలో స్వామి వారి ఊరేగింపును దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. ఈ సందర్భంగా అరుణాచల కొండలు పరమశివుడి నామస్మరణతో మారుమ్రోగాయి. అఖండ జ్యోతి రూపంలో పరమశివుడిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు.
ఇదీ చదవండి
జ్ఞానం శిలలుగా.. భక్తి నెలవుగా.. అరుణాచలం
Tags :
జనరల్
జిల్లా వార్తలు