News In Pics: చిత్రం చెప్పే సంగతులు-02(23-03-2023)

Updated : 23 Mar 2023 22:39 IST
1/31
ఈరోజు హీరో శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన తమ్ముడిగా భావించే శ్రీకాంత్‌ని ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరు శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌, శంకర్‌ దాదా జిందాబాద్‌ చిత్రాలలో కలిసి నటించారు. ఈరోజు హీరో శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన తమ్ముడిగా భావించే శ్రీకాంత్‌ని ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరు శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌, శంకర్‌ దాదా జిందాబాద్‌ చిత్రాలలో కలిసి నటించారు.
2/31
తెలంగాణలో విపరీతంగా కురుస్తున్న వడగండ్ల వానకు పంటలు తడిసి ముద్దవుతున్నాయి. గురువారం కురిసిన వర్షానికి వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి బస్తాలు తడిసిపోయాయి. మిర్చి బస్తాల చుట్టూ వర్షపు నీరు చేరడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో విపరీతంగా కురుస్తున్న వడగండ్ల వానకు పంటలు తడిసి ముద్దవుతున్నాయి. గురువారం కురిసిన వర్షానికి వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి బస్తాలు తడిసిపోయాయి. మిర్చి బస్తాల చుట్టూ వర్షపు నీరు చేరడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
3/31
బీటలు వారి.. పగిలిపోయి ఉన్న ఈ భవనాన్ని చూసి ఇదేదో పాడుబడిన భవంతి అనుకుంటే పొరపాటే.. ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని శస్త్ర చికిత్స విభాగం పరిస్థితి ఇది.. మరమ్మతులు లేక ఈ భవనం శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారింది. బీటలు వారి.. పగిలిపోయి ఉన్న ఈ భవనాన్ని చూసి ఇదేదో పాడుబడిన భవంతి అనుకుంటే పొరపాటే.. ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని శస్త్ర చికిత్స విభాగం పరిస్థితి ఇది.. మరమ్మతులు లేక ఈ భవనం శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారింది.
4/31
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. చంద్రబాబు నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకుని వేడుకలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. చంద్రబాబు నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకుని వేడుకలు చేసుకున్నారు.
5/31
మాదాపూర్‌లో నిర్వహించిన ‘గుడ్‌ స్కూల్‌’ యాప్‌ లాంచ్‌ కార్యక్రమంలో సినీనటుడు అడివి శేష్‌ పాల్గొని సందడి చేశారు. విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. మాదాపూర్‌లో నిర్వహించిన ‘గుడ్‌ స్కూల్‌’ యాప్‌ లాంచ్‌ కార్యక్రమంలో సినీనటుడు అడివి శేష్‌ పాల్గొని సందడి చేశారు. విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు.
6/31
కర్నూలు శివారులోని కల్లూరు చౌడేశ్వరీ ఆలయం వద్ద ఉగాది వేడుకల్లో భాగంగా గాడిదలు, ఎడ్ల బండ్లతో ప్రదక్షిణలు చేశారు. బండ్లను రంగులతో అలంకరించి  బురదలో ఆలయం చుట్టూ తిరిగారు. వేడుకను చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కర్నూలు శివారులోని కల్లూరు చౌడేశ్వరీ ఆలయం వద్ద ఉగాది వేడుకల్లో భాగంగా గాడిదలు, ఎడ్ల బండ్లతో ప్రదక్షిణలు చేశారు. బండ్లను రంగులతో అలంకరించి బురదలో ఆలయం చుట్టూ తిరిగారు. వేడుకను చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
7/31
విశాఖలో జీ20 సదస్సు సందర్భంగా ముందస్తుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పడవల పోటీలు నిర్వహించగా స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశాఖలో జీ20 సదస్సు సందర్భంగా ముందస్తుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పడవల పోటీలు నిర్వహించగా స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
8/31
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మార్చి 31 నుంచి ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో జ్యువెల్లరీ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను గురువారం నిర్వహించగా.. కార్యక్రమానికి పలువురు మోడల్స్‌ హాజరై సందడి చేశారు.. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మార్చి 31 నుంచి ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో జ్యువెల్లరీ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను గురువారం నిర్వహించగా.. కార్యక్రమానికి పలువురు మోడల్స్‌ హాజరై సందడి చేశారు..
9/31
కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌లో పాల్గొన్న మోల్‌ శ్రీలేఖ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌లో పాల్గొన్న మోల్‌ శ్రీలేఖ
10/31
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో లక్కీ డ్రా ప్రారంభించారు. తమ వినియోగదారుల్లో గెలిచిన వారికి కారు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మోడల్‌ కుసుమ పెనుమూడి పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో లక్కీ డ్రా ప్రారంభించారు. తమ వినియోగదారుల్లో గెలిచిన వారికి కారు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మోడల్‌ కుసుమ పెనుమూడి పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
11/31
లాస్‌ఏంజెలెస్‌లోని టీసీఎల్‌ చైనీస్‌ థియేటర్‌లో ‘ఎల్లో జాకెట్స్‌’ సీజన్‌2 ప్రీమియర్స్‌ను ప్రదర్శించారు. కార్యక్రమంలో అమెరికన్‌ నటి సమంత హన్రాట్టి పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. లాస్‌ఏంజెలెస్‌లోని టీసీఎల్‌ చైనీస్‌ థియేటర్‌లో ‘ఎల్లో జాకెట్స్‌’ సీజన్‌2 ప్రీమియర్స్‌ను ప్రదర్శించారు. కార్యక్రమంలో అమెరికన్‌ నటి సమంత హన్రాట్టి పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
12/31
ఫొటోలకు పోజులిస్తున్న సమంత హన్రాట్టి ఫొటోలకు పోజులిస్తున్న సమంత హన్రాట్టి
13/31
‘ఉత్తమ షార్ట్‌ డాక్యుమెంటరీ’ కేటగిరీలో భారతీయ సినిమా ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’కు ఆస్కార్‌ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందులో నటించిన బొమ్మన్‌, బెల్లీలు అవార్డును చేతుల్లోకి తీసుకొని సంబరపడిపోతున్న ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ ఫొటోకు ఫిదా అవుతున్నారు. ‘ఉత్తమ షార్ట్‌ డాక్యుమెంటరీ’ కేటగిరీలో భారతీయ సినిమా ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’కు ఆస్కార్‌ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందులో నటించిన బొమ్మన్‌, బెల్లీలు అవార్డును చేతుల్లోకి తీసుకొని సంబరపడిపోతున్న ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ ఫొటోకు ఫిదా అవుతున్నారు.
14/31
అఖిల్‌ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఏజెంట్‌’. ఈ సినిమాలోని సెకండ్‌ సింగిల్‌ ‘ఏందే ఏందే’ పాటను 24న లాంచ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఏప్రిల్‌ 28న ‘ఏజెంట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్‌ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఏజెంట్‌’. ఈ సినిమాలోని సెకండ్‌ సింగిల్‌ ‘ఏందే ఏందే’ పాటను 24న లాంచ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఏప్రిల్‌ 28న ‘ఏజెంట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
15/31
నాని (Nani) హీరోగా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తి సురేశ్‌ కథానాయిక. సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగ్‌పుర్‌ వెళ్లిన నాని.. అక్కడ ట్రాక్టర్‌ నడుపుతూ సందడి చేశారు. నాని (Nani) హీరోగా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తి సురేశ్‌ కథానాయిక. సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగ్‌పుర్‌ వెళ్లిన నాని.. అక్కడ ట్రాక్టర్‌ నడుపుతూ సందడి చేశారు.
16/31
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న వెంకయ్యనాయుడు... అడ్వాణీ తనకు పితృ సమానులు, స్ఫూర్తి ప్రదాత అని తెలుపుతూ పోస్టు పెట్టారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న వెంకయ్యనాయుడు... అడ్వాణీ తనకు పితృ సమానులు, స్ఫూర్తి ప్రదాత అని తెలుపుతూ పోస్టు పెట్టారు.
17/31
భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమం నిర్వహించారు. ఈనెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక వేడుక కోసం ఈ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు. భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమం నిర్వహించారు. ఈనెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక వేడుక కోసం ఈ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు.
18/31
విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఖుషి’. ఈ సినిమాను సెప్టెంబర్‌ 1న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘ఒకరి కోసం మరొకరు తపించే రెండు ప్రపంచాలను ఖుషి సినిమాలో చూడవచ్చు’ అని ట్విటర్‌ వేదికగా పోస్టు పెట్టింది. విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఖుషి’. ఈ సినిమాను సెప్టెంబర్‌ 1న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘ఒకరి కోసం మరొకరు తపించే రెండు ప్రపంచాలను ఖుషి సినిమాలో చూడవచ్చు’ అని ట్విటర్‌ వేదికగా పోస్టు పెట్టింది.
19/31
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగమార్తాండ’ సినిమా బుధవారం థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాలో బ్రహ్మానందం నటన అద్భుతంగా ఉందని కితాబిస్తూ చిరంజీవి, రామ్‌చరణ్‌ ఆయన్ను సత్కరించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగమార్తాండ’ సినిమా బుధవారం థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాలో బ్రహ్మానందం నటన అద్భుతంగా ఉందని కితాబిస్తూ చిరంజీవి, రామ్‌చరణ్‌ ఆయన్ను సత్కరించారు.
20/31
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పాట పాడిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సత్కరించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పాట పాడిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సత్కరించారు.
21/31
నాని, కీర్తి సురేష్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’.  మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రవితేజతో కలిసి దిగిన ఫొటోను నాని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. మరోవైపు రవితేజ కథానాయకుడిగా నటించిన ‘రావణాసుర’ ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని, కీర్తి సురేష్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రవితేజతో కలిసి దిగిన ఫొటోను నాని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. మరోవైపు రవితేజ కథానాయకుడిగా నటించిన ‘రావణాసుర’ ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
22/31
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉండవల్లిలోని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు నివాసం నుంచి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉండవల్లిలోని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు నివాసం నుంచి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.
23/31
ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలని రైతులు ఈ సందర్భంగా సీఎంను కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలని రైతులు ఈ సందర్భంగా సీఎంను కోరారు.
24/31
చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌, లహరీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం ట్విటర్‌ వేదికగా పంచుకుంది. జూన్‌ 2న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌, లహరీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం ట్విటర్‌ వేదికగా పంచుకుంది. జూన్‌ 2న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
25/31
విష్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దాస్‌ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. బుధవారం ఉగాది కానుకగా విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.88కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. విష్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దాస్‌ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. బుధవారం ఉగాది కానుకగా విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.88కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది.
26/31
సమంత, దేవ్‌మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘కావ్యనాయకి శకుంతలా దేవి’ అని చెబుతూ చిత్రబృందం సమంత ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. సమంత, దేవ్‌మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘కావ్యనాయకి శకుంతలా దేవి’ అని చెబుతూ చిత్రబృందం సమంత ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకుంది.
27/31
28/31
ఏపీ అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీ అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
29/31
ఉగాది పండగ సందర్భంగా ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో బుధవారంవేడుకలు నిర్వహించారు. హాస్యనటుడు బ్రహ్మానందంను సత్కరించి సన్మానించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కాజా సూర్య నారాయణ రంగారావు (ఎఫ్‌ఎంసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌) నిర్మాత త్రివిక్రమ్‌ పాల్గొన్నారు. ఈ వేడుకలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉగాది పండగ సందర్భంగా ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో బుధవారంవేడుకలు నిర్వహించారు. హాస్యనటుడు బ్రహ్మానందంను సత్కరించి సన్మానించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కాజా సూర్య నారాయణ రంగారావు (ఎఫ్‌ఎంసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌) నిర్మాత త్రివిక్రమ్‌ పాల్గొన్నారు. ఈ వేడుకలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
30/31
కార్యక్రమంలో నృత్యం చేస్తోన్న నటి శిరీష.. కార్యక్రమంలో నృత్యం చేస్తోన్న నటి శిరీష..
31/31
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) కొత్త సినిమా మొదలైంది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ కొరటాల శివ జాన్వీకపూర్‌ ప్రకాశ్‌రాజ్‌ శ్రీకాంత్‌ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు సంగీత దర్శకుడు అనిరుధ్‌ నిర్మాత కల్యాణ్‌ రామ్‌ తదితరులు సందడి చేశారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) కొత్త సినిమా మొదలైంది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ కొరటాల శివ జాన్వీకపూర్‌ ప్రకాశ్‌రాజ్‌ శ్రీకాంత్‌ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు సంగీత దర్శకుడు అనిరుధ్‌ నిర్మాత కల్యాణ్‌ రామ్‌ తదితరులు సందడి చేశారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు